AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress MLA Joins BJP: ఎన్నికల ముందు కాంగ్రెస్‌‌కు భారీ షాక్.. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్

Himachal Pradesh Politics: ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పవన్ కాజల్, లఖ్వీందర్ సింగ్ రాణా బీజేపీలో చేరారని హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ తెలిపారు. ఢిల్లీలో వీరంతా బీజేపీలో చేరారు.

Congress MLA Joins BJP: ఎన్నికల ముందు కాంగ్రెస్‌‌కు భారీ షాక్.. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్
Cm Jairam Thakur
Sanjay Kasula
|

Updated on: Aug 17, 2022 | 6:13 PM

Share

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇద్దరు పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి జంప్ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (MLA) బీజేపీలో(BJP) చేరారు. ఈ ఎమ్మెల్యేలలో కాంగ్రా ఎమ్మెల్యే పవన్ కాజల్, నలాగఢ్ ఎమ్మెల్యే లఖ్వీందర్ సింగ్ రాణా ఉన్నారు. ఈ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం ఉందని చాలా కాలంగా వార్తలు వచ్చాయి. ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ సమక్షంలో పవన్ కాజల్, లఖ్వీందర్ సింగ్ రాణా బీజేపీలో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నేత, వర్కింగ్ ప్రెసిడెంట్ పవన్ కాజల్ బీజేపీలో చేరారని.. ఆయనకు స్వాగతం పలుకుతున్నామని సీఎం జై రామ్ ఠాకూర్ అన్నారు. దీంతో పాటు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లఖ్వీందర్ సింగ్ రాణా కూడా బీజేపీలో చేరారు. ఇంతమంది రావడం వల్ల పార్టీకి బలం చేకూరుతుందన్నారు.

కాంగ్రెస్ నాయకత్వంపై ప్రశ్నలు..

ఇవి కూడా చదవండి

ఇద్దరు ఎమ్మెల్యేల ఈ నిర్ణయంతో ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్‌లో అంతా సవ్యంగా సాగుతోందని.. బీజేపీ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నా అందుకు విరుద్ధంగా జరిగింది. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని పేర్కొన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయి.

దీంతో కాంగ్రెస్‌ వైదొలిగింది

హిమాచల్ ప్రదేశ్‌లో జరుగుతున్న వర్గపోరును అంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రతిభా సింగ్‌కు రంగంలోకి దింపింది. దీంతో పాటు పవన్‌ కాజల్‌తో సహా నలుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లు కూడా ఉన్నారు. తన టికెట్ పోతుందనే భయంతో పవన్ కాజల్ పార్టీని వీడారు. మరోవైపు, లఖ్వీందర్ సింగ్ రాణా ఈ నిర్ణయం వెనుక హర్దీప్ సింగ్ బావాను అతని నియోజకవర్గంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేయాలని చూస్తోంది.

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

మరిన్ని జాతీయ వార్తల కోసం