AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: కేదార్‌నాథ్‌లో హెలికాప్ట‌ర్ ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్.. ఏం జరిగిందో చూపించే వీడియో వైరల్

మే 12న భక్తుల కోసం బద్రీనాథ్ తలుపులు తెరిచారు. ముఖ్యంగా, చార్ ధామ్ యాత్ర హిందూమతంలో ముఖ్యమైన ఆధ్యాత్మిక యాత్ర. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఏప్రిల్-మే నుండి అక్టోబర్-నవంబర్ వరకు కొనసాగుతుంది. జీవితంలో ఒక్కసారైన చార్ ధామ్ యాత్రను పూర్తి చేయాలని భక్తులు విశ్వసిస్తారు.

Watch Video: కేదార్‌నాథ్‌లో హెలికాప్ట‌ర్ ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్.. ఏం జరిగిందో చూపించే వీడియో వైరల్
Helicopter Makes Emergency Landing
Jyothi Gadda
|

Updated on: May 24, 2024 | 12:11 PM

Share

కేదార్‌నాథ్‌లో శుక్రవారం (మే24)రోజున హెలికాప్ట‌ర్ ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. ఆ హెలికాప్ట‌ర్‌లో ఏడుగురు ఉన్నారని తెలిసింది. హెలికాఫ్టర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వ‌ల్ల ఆ హెలికాప్ట‌ర్‌ను అత్య‌వ‌స‌రంగా దించేశారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌తో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. హెలిప్యాడ్‌కు దాదాపు 100 మీటర్ల ముందు హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది. పైలట్‌తో సహా ప్రయాణీకులందరూ సురక్షితంగా బయటపడ్డారు.

ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని హెలికాప్టర్ పైలట్ తెలిపారు. ఇదిలావుండగా, హెలికాప్టర్ సిర్సీ హెలిప్యాడ్ నుండి కేదార్‌నాథ్ ధామ్‌కు వస్తోందని, ఆరుగురు ప్రయాణికులతో ఉందని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. సాంకేతిక సమస్య కారణంగా హెలికాప్టర్ 7.05 గంటల ప్రాంతంలో కేదార్‌నాథ్ ధామ్ హెలిప్యాడ్‌కు దాదాపు 100 మీటర్ల ముందు అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడిందని ఆయన చెప్పారు. హెలికాప్ట‌ర్‌లోని రోట‌ర్‌కు స‌మ‌స్య తలెత్త‌డంతో.. క్రిస్ట‌ల్ కంపెనీకి చెందిన ఆ హెలికాప్ట‌ర్‌.. హెలిప్యాడ్‌కు దూరంగా ల్యాండ్ అయ్యింది. ఫ‌టా నుంచి కేదార్‌నాథ్ ఆల‌యానికి వెళ్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌తో సహా నాలుగు పుణ్యక్షేత్రాలలో మూడింటిని తెరిచిన తర్వాత మే 10న చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన సమయంలో ఈ సంఘటన జరిగింది. మే 12న భక్తుల కోసం బద్రీనాథ్ తలుపులు తెరిచారు. ముఖ్యంగా, చార్ ధామ్ యాత్ర హిందూమతంలో ముఖ్యమైన ఆధ్యాత్మిక యాత్ర. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఏప్రిల్-మే నుండి అక్టోబర్-నవంబర్ వరకు కొనసాగుతుంది. జీవితంలో ఒక్కసారైన చార్ ధామ్ యాత్రను పూర్తి చేయాలని భక్తులు విశ్వసిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…