AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంతటి దారుణం.. గోవుల స్మగ్లర్ అనుకుని 19 ఏళ్ల విద్యార్థిని కాల్చేశారు.. 30 కి.మీ వెంబడించి మరీ..

మృతుడు ఆర్యన్‌ అతని స్నేహితులు శాంకీ, హ‌ర్షిత్‌తో కారులో వెళ్తుండగా, గోవులను స్మ‌గ్లింగ్ చేసే వ్య‌క్తులుగా భావించి నిందితులు వెంట‌బ‌డ్డారు. సుమారు 30 కిలోమీట‌ర్ల దూరం కారులో ఛేజ్ చేశారు. డ్రైవ‌ర్ సీటులో ఉన్న హ‌ర్షిత్ కారును ఆప‌లేదు. దాంతో కాల్పులు జ‌రిపారు. ముందు సీటులో కూర్చున్న ఆర్య‌న్‌కు బుల్లెట్ త‌గిలింది. కారు ఆగిన త‌ర్వాత కూడా మ‌రోసారి షూట్ చేశారు.

ఎంతటి దారుణం.. గోవుల స్మగ్లర్ అనుకుని 19 ఏళ్ల విద్యార్థిని కాల్చేశారు.. 30 కి.మీ వెంబడించి మరీ..
Cow Smuggler
Jyothi Gadda
|

Updated on: Sep 03, 2024 | 1:10 PM

Share

హ‌ర్యానాలోని ఫ‌రీదాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. చిన్న పొరపాటు కారణంగా 19 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. 12వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఓ విద్యార్థిని గో సంర‌క్ష‌కులు కాల్చి చంపేశారు. పశువులను అక్రమంగా తరలిస్తూ స్మ‌గ్లింగ్ చేస్తున్నాడ‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఆ విద్యార్థిని అంతం చేశారు. ఆగ‌స్టు 23వ తేదీన జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో గోసంర‌క్ష‌ణ గ్రూపున‌కు చెందిన అయిదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. హ‌ర్యానాలోని ఢిల్లీ-ఆగ్రా హైవేపై ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు..మృతుడు ఆర్యన్, అతని స్నేహితులు ప్రయాణిస్తున్న కారును ఢిల్లీ-ఆగ్రా హైవేపై దాదాపు 30 కిమీ మేర నిందితులు వెంబడించారు. ఐదుగురు గోసంరక్షకులను అరెస్టు చేశామని పోలీసులు తాజాగా వెల్లడించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుల‌ను అనిల్ కౌశిక్‌, వ‌రున్‌, కృష్ణ‌, ఆదేశ్‌, సౌర‌భ్‌గా గుర్తించారు. మృతుడు ఆర్యన్‌ అతని స్నేహితులు శాంకీ, హ‌ర్షిత్‌తో కారులో వెళ్తుండగా, గోవులను స్మ‌గ్లింగ్ చేసే వ్య‌క్తులుగా భావించి నిందితులు వెంట‌బ‌డ్డారు. సుమారు 30 కిలోమీట‌ర్ల దూరం కారులో ఛేజ్ చేశారు. డ్రైవ‌ర్ సీటులో ఉన్న హ‌ర్షిత్ కారును ఆప‌లేదు. దాంతో కాల్పులు జ‌రిపారు. ముందు సీటులో కూర్చున్న ఆర్య‌న్‌కు బుల్లెట్ త‌గిలింది. కారు ఆగిన త‌ర్వాత కూడా మ‌రోసారి షూట్ చేశారు.

అయితే, నిందితులు వెంబడించిన విద్యార్థుల కారులో ఇద్ద‌రు బాలికలు కూడా ఉన్నారు. దాంతో కంగుతిన్న నిందితులు అక్క‌డ నుంచి పారిపోయారు. ఆర్య‌న్‌ను ఆస్ప‌త్రిగా తీసుకెళ్లినా ఫ‌లితం లేకపోయింది. అప్పటికే అతడు మృతిచెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..