AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ban On Youtube channels: కేంద్రం కీలక నిర్ణయం.. 22 యూట్యూబ్‌ ఛానెళ్లపై నిషేధం విధింపు..

దేశ జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, ప్రజా శాంతికి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు 18 భారతీయ, 4 పాకిస్తాన్ ఆధారిత యూట్యూబ్(Youtube) ఛానెల్‌లను బ్లాక్ చేసినట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది.

Ban On Youtube channels: కేంద్రం కీలక నిర్ణయం.. 22 యూట్యూబ్‌ ఛానెళ్లపై నిషేధం విధింపు..
Social Media
Srinivas Chekkilla
|

Updated on: Apr 05, 2022 | 4:51 PM

Share

దేశ జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, ప్రజా శాంతికి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు 18 భారతీయ, 4 పాకిస్తాన్ ఆధారిత యూట్యూబ్(Youtube) ఛానెల్‌లను బ్లాక్ చేసినట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. వీక్షకులను తప్పుదారి పట్టించేందుకు ఈ ఛానెళ్లు.. టీవీ వార్తా ఛానెళ్ల లోగోలు, తప్పుడు సూక్ష్మచిత్రాలను ఉపయోగించాయని పేర్కొంది. అంతేకాకుండా 3 ట్విట్టర్(twitter) ఖాతాలు, ఒక ఫేస్‌బుక్(Facebook) ఖాతా, ఒక వార్తా వెబ్‌సైట్ కూడా బ్లాక్ చేశారు. బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెళ్ల వీక్షకుల సంఖ్య 260 కోట్లకు పైగా ఉంది. ఈ యూట్యూబ్ ఛానెళ్లు నకిలీ వార్తలను వ్యాప్తి చేశాయని, సున్నితమైన విషయాలపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశాయని ఆరోపణలు ఉన్నాయి.

గత ఏడాది ఫిబ్రవరిలో ఐటి రూల్స్ 2021 నోటిఫికేషన్ తర్వాత భారతీయ యూట్యూబ్ ఛానెళ్లపై చర్య తీసుకోవడం ఇదే మొదటిసారి అని ప్రభుత్వం తెలిపింది. బ్లాక్ అయిన భారతీయ యూట్యూబ్ ఛానెళ్లు వార్తల టెంప్లేట్‌లు, లోగోలను ఉపయోగిస్తున్నాయి. ఛానెళ్లు, తమ వార్తా యాంకర్ల చిత్రాలతో సహా వీక్షకులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ఖాతాలలోని కంటెంట్‌లను విశ్లేషించిన తర్వాత, ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి సంబంధించి తప్పుడు కంటెంట్ ఉందని ప్రభుత్వం కనుగొంది.

గత కొన్నేళ్లుగా తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుటోంది. డిసెంబర్ 2021 నుంచి, జాతీయ భద్రత, పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించి 78 యూట్యూబ్ ఛానెళ్లు, అనేక ఇతర సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Read Sanjay Raut: శివసేన ఎంపీ ఆస్తులపై ఈడీ దాడులు.. మనీలాండరింగ్ చేసినట్లుగా ఆరోపణలు..

Follow Us
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై