AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటకలో మరో పరువు హత్య.. కూతురును చంపి పూడ్చిన తండ్రి

కర్ణాటకలో మరో దారుణంలో వెలుగుచూసింది. దళిత యువకుడ్ని ప్రేమించిన బాలికను ఆమె తండ్రితోపాటు కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేశారు.

కర్ణాటకలో మరో పరువు హత్య.. కూతురును చంపి పూడ్చిన తండ్రి
Balaraju Goud
|

Updated on: Oct 17, 2020 | 3:40 PM

Share

కర్ణాటకలో మరో దారుణంలో వెలుగుచూసింది. దళిత యువకుడ్ని ప్రేమించిన బాలికను ఆమె తండ్రితోపాటు కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేశారు. కర్ణాటకలోని రామనగర జిల్లా బెట్టహల్లి గ్రామంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. 20 ఏండ్ల దళిత యువకుడితో సంబంధం పెట్టుకుందన్న కారణం చేత 18 ఏండ్ల బాలికను ఆమె తండ్రి, వరుసకు సోదరులైన మరో ఇద్దరు ఈ నెల 9న గ్రామ శివారులోని తోటలోకి తీసుకెళ్లారు. డంబుల్‌తో ఆమె తలపై మోది హతమార్చి అక్కడ పూడ్చిపెట్టారు. అనంతరం తన కుమార్తె కనిపించడంలేదంటూ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పైగా ఆమె ప్రియుడిపై అనుమానం వ్యక్తం చేశాడు తండ్రి. పోలీసులు ఆ దళిత యువకుడ్ని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు బాలిక అదృశ్యం వెనుక అతడి ప్రమేయం లేదని తెలిసింది. ఇది పరువు హత్యగా పోలీసులు తేల్చారు.

మరోవైపు, ఆరు రోజుల తర్వాత ఆ తోటలో మొక్కలు నాటేందుకు అక్కడివారు తవ్వగా శిథిలమైన బాలిక మృతదేహం బయటపడింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తండ్రితో పాటు మరో ఇద్దరు నిందితులుగా నిర్ధారించారు. రామనగర జిల్లా బెట్టహల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడిని 18 ఏళ్ల యువతి ప్రేమించింది. ఈ విషయం తెలిసిన తండ్రి కోపంతో రగిలిపోయాడు. ఆమెను హతమార్చాలనుకున్నాడు. మరో ఇద్దరు బంధువుల సహకారంతో బాలికను ఓ తోటలోకి తీసుకెళ్లి చంపి.. అక్కడే పూడ్చేశారని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు ఆమె తండ్రిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. మరో ఇద్దరి సహాయంతో తన కుమార్తెను హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు ఆ ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.