‘ట్రంప్ వచ్చి బీహార్ కి ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తాడా’ ? తేజస్వి యాదవ్

బీహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల 'మహా ఘట్ బంధన్' శనివారం తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కూడిన ఈ 'మహా కూటమి'..బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి అంశాన్ని లేవనెత్తింది.

'ట్రంప్ వచ్చి బీహార్ కి ప్రత్యేక  ప్రతిపత్తి ఇస్తాడా' ? తేజస్వి యాదవ్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 17, 2020 | 3:48 PM

బీహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల ‘మహా ఘట్ బంధన్’ శనివారం తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కూడిన ఈ ‘మహా కూటమి’..బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి అంశాన్ని లేవనెత్తింది. గత 15 సంవత్సరాలుగా నితీష్ కుమార్ ఈ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని, కానీ ప్రత్యేక ప్రతిపత్తి మాత్రం రాలేదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక్కడికి వచ్చి ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తాడా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్ ఇన్నేళ్ళుగా ఈ రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పటికీ స్పెషల్ కేటగిరీ మాత్రం రాలేదన్నారు. బీజేపీ, జేడీ-యూ అధినేత నితీష్ ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారని ఆయన  దుయ్యబట్టారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పక్షంలో పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, వివాదాస్పద రైతు చట్టాలను రద్దు చేస్తామని ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపక్ష నేతలు హామీ ఇచ్చారు.   ఈ 15 ఏళ్లలో రాష్ట్రంలో  నేరాలు, ఘోరాలు పెరిగిపోయాయని తేజస్వి యాదవ్ అన్నారు. 2005 లో నితీష్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తరచూ ప్రత్యేక ప్రతిపత్తి అంశం తెరమీదకి వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సైతం కొన్ని పార్టీల నేతలు ఈ నినాదాన్ని ప్రస్తావించారు. కాగా ఈ మేనిఫెస్టో విడుదల సందర్భంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణవీర్ సింగ్ సూర్జేవాలా కూడా పాల్గొని..రాష్ట్రంలో మార్పు రావాలని తాము కోరుతున్నామన్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..