Earthquake : ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.7 గా నమోదు..

Earthquake : ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం భూకంపం పరిమాణం

Earthquake : ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.7 గా నమోదు..
Earthquake
Follow us

|

Updated on: Jul 06, 2021 | 12:02 AM

Earthquake : ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం భూకంపం పరిమాణం రిక్టర్ స్కేల్‌లో 3.7 గా నమోదైంది. హర్యానాలోని జజ్జర్‌కు ఉత్తరాన 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నెలకొని ఉన్నట్లు అధికారులు తెలిపారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం.. భూకంపం లోతు 5 కి.మీ. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

అంతకుముందు ఆదివారం గుజరాత్‌లోని కచ్ జిల్లాలో 3.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 7:25 గంటలకు జరిగింది. భూకంప కేంద్రం దుధైకి ఈశాన్యంగా 19 కిలోమీటర్ల దూరంలో 11.8 కిలోమీటర్ల లోతులో ఉందని గాంధీనగర్ కేంద్రంగా ఉన్న భూకంప పరిశోధన సంస్థ అధికారి తెలిపారు. గత ఏడాది ఏప్రిల్-ఆగస్టులో రాజధాని ప్రాంతంలో అనేక భూకంపాలు సంభవించిన తరువాత, భూకంప కార్యకలాపాలను నిశితంగా పరిశీలించడానికి సెంటర్ ఫర్ సీస్మోలజీ అదనపు భూకంప రికార్డింగ్ పరికరాలను మోహరించింది.

ఈశాన్య ఢిల్లీ రోహ్‌తక్, సోనిపట్, బాగ్‌పట్, ఫరీదాబాద్, అల్వార్లలో కేంద్రాలు 2020 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు తక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవిస్తున్నాయి. ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ ఆధారంగా Acti ఢిల్లీలోని వజీరాబాద్, తైమూర్పూర్, కమలా నెహ్రూ రిడ్జ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు, అల్వార్ జిల్లాలు, సోనిపట్, సోహ్నా, గురుగ్రామ్, రోహ్తక్, రేవారి, హర్యానా ప్రాంతాలలో భూమి కదలికతో సహా పలు సంకేతాలు గమనించారు.

Andhra Pradesh: కరోనా బాధిత గవర్నమెంట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్..!

Andhrapradesh: ‘జగనన్న హౌసింగ్ కాలనీలకు ఇసుక కొరత లేనే లేదు’.. వారికి ఫ్రీగానే ఇస్తున్నామన్న ద్వివేది

India vs Sri Lanka: ప్రాక్టీస్ మ్యాచ్ లో తలపడిన శిఖర్, భువనేశ్వర్..! ఆటగాళ్ల క్వారంటైన్ పూర్తి

Srisailam drone: శ్రీశైలంలో అంతు చిక్కని రహస్యం.. డ్రోన్ల చక్కర్లపై ఫోకస్ పెట్టిన కర్నూలు ఎస్పీ..