AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Sri Lanka: ప్రాక్టీస్ మ్యాచ్ లో తలపడిన శిఖర్, భువనేశ్వర్..! ఆటగాళ్ల క్వారంటైన్ పూర్తి

టీమిండియా రెండవ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ లో తలపడేందుకు శ్రీలంక వెళ్లింది. ఈ టూర్ కి శిఖర్ ధవన్ సారథిగా వ్యవరించనున్నాడు. రాహుల్ ద్రవిడ్ కోచ్ గా నియమించిన సంగతి తెలిసిందే. భారత జట్టు క్వారంటైన్ పూర్తి చేసుకుంది. ఈమేరకు సన్నాహకాలు ప్రారంభించింది.

India vs Sri Lanka: ప్రాక్టీస్ మ్యాచ్ లో తలపడిన శిఖర్, భువనేశ్వర్..! ఆటగాళ్ల క్వారంటైన్ పూర్తి
Team India
Venkata Chari
|

Updated on: Jul 05, 2021 | 10:25 PM

Share

India vs Sri Lanka: టీమిండియా రెండవ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ లో తలపడేందుకు శ్రీలంక వెళ్లింది. ఈ టూర్ కి శిఖర్ ధవన్ సారథిగా వ్యవరించనున్నాడు. రాహుల్ ద్రవిడ్ కోచ్ గా నియమించిన సంగతి తెలిసిందే. భారత జట్టు క్వారంటైన్ పూర్తి చేసుకుంది. ఈమేరకు సన్నాహకాలు ప్రారంభించింది. టీమిండియా జట్టు శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని జట్టు ఇంగ్లండ్ లో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. అందుకే భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రయోగాత్మకంగా యువ జట్టును శ్రీలంకకు పయనం చేయించింది. ఐపీఎల్, భారత్ ఏ తరఫున ఆడిన ఆటగాళ్లను శ్రీలంక టూర్‌కు ఎంపిక చేసింది. ఈ మేరకు శ్రీలంకకు చేరుకుని క్వారంటైన్ పూర్తి చేసుకున్న ఆటగాళ్లనై ఒత్తిడి తగ్గించేందుకు బీసీసీఐ సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. మొన్నటి వరకు సరదాగా ఇండోర్ లో గేమ్స్ ఆడించిన మేనేజ్మెంట్.. తాజాగా ప్రాక్టీస్ మ్యాచులు ఆడించింది. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం 20 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశారు. ఇందులో ఐదుగురిని నెట్ బౌలర్లుగా ఎంపిక చేసింది. విరాట్ సేన తరహాలోనే శ్రీలంకకు వెళ్లేముందు ముంబైలో 15 రోజుల క్వారంటైన్‌లో ఉంచింది బీసీసీఐ. అనంతరం శ్రీలంకకు చేరుకున్న ఆటగాళ్లు.. మరో మూడు రోజులు క్వారంటైన్‌లో ఉన్నారు.

ఈ మేరకు సోమవారం రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. భారత ఆటగాళ్లను రెండు జట్లుగా విభజించారు. ఓ జట్టుకు కెప్టెన్ గా శిఖర్ ధావన్, మరో జట్టుకు కెప్టెన్ గా భువనేశ్వర్ కుమార్‌లు వ్యవహరించారు. ఈ మేరకు మ్యాచ్ ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్లో పంచుకుంద. అయితే స్కోర్ బోర్డును మాత్రం వెల్లడించలేదు. ఈ ఫొటోల్లో శిఖర్ ధావన్, మనీష్ పాండే, రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ చేస్తూ కనిపించారు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేశాడు. ఇషాన్ కిషన్ కీపర్‌గా కనిపించాడు. పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్ ఫీల్డింగ్ చేస్తూ ఫొటోల్లో కనిపించారు.

Also Read:

Smriti Mandhana: ఈ రెండు షరతులు నెరవేర్చితే.. స్మృతి మంధనా జీవిత భాగస్వామిగా అర్హత సాధించినట్లే..! గతేడాది ట్వీట్ వైరల్

Tokyo Olympics 2020: ఒలింపిక్ పతకాల కోసం 15 మంది భారత షూటర్లు సిద్ధం; ఫేవరెట్ గా బరిలోకి దిగేది ఎవరో తెలుసా..?

నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం