Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dharmendra Pradhan: మోడీ దార్శనికతకు ఇదే నిదర్శనం.. డిజిటల్ నైపుణ్యాన్ని మెరుగుపర్చేందుకు ‘మెటా’తో భాగస్వామ్యం..

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భాగస్వామ్యంతో మెటా, AI, VR సామర్థ్యంతో CBSE పాఠశాలల అనుసంధానం పెరుగుతుందని, ఇది సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పెంచుతుందని పేర్కొన్నారు. కెపాసిటీ బిల్డింగ్ కోసం ఏఐసీటీఈతో కలిసి మెటా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. NIESBUDతో భాగస్వామ్యంతో 5 లక్షల మంది పారిశ్రామికవేత్తలకు వచ్చే 3 సంవత్సరాలలో Meta ద్వారా డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు.

Dharmendra Pradhan: మోడీ దార్శనికతకు ఇదే నిదర్శనం.. డిజిటల్ నైపుణ్యాన్ని మెరుగుపర్చేందుకు ‘మెటా’తో భాగస్వామ్యం..
Dharmendra Pradhan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 05, 2023 | 3:02 PM

Education Ministry Meta Partnership: విద్యార్థులకు సాంకేతికతతో కూడిన విద్యను అందించేందుకు కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలకు నాంది పలికిన విషయం తెలిసిందే. డిజిలైజేషన్‌లో భాగంలో పలు కీలక చర్యలు చేపట్టింది. తాజాగా.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్‌మెంట్ (NIESBUD) విద్యార్థులకు డిజిటల్, స్కిల్ ఎడ్యుకేషన్‌ను అందించడానికి మెటాతో భాగస్వామ్యం కానున్నాయి. భారత ప్రభుత్వానికి చెందిన కీలక విద్యాసంస్థలతో మెటా కంపెనీ మధ్య సోమవారం (ఎంఓయూ) ఒప్పందం కుదిరింది. Meta, NIESBUD, AICTE, CBSEల మధ్య మూడు లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ (LoI) మార్పిడి జరిగింది. ఈ సందర్భంగా భాగస్వామ్యాల వివరాలను తెలియజేస్తూ పలు కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భాగస్వామ్యంతో మెటా, AI, VR సామర్థ్యంతో CBSE పాఠశాలల అనుసంధానం పెరుగుతుందని, ఇది సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పెంచుతుందని పేర్కొన్నారు. కెపాసిటీ బిల్డింగ్ కోసం ఏఐసీటీఈతో కలిసి మెటా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. NIESBUDతో భాగస్వామ్యంతో 5 లక్షల మంది పారిశ్రామికవేత్తలకు వచ్చే 3 సంవత్సరాలలో Meta ద్వారా డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. 7 ప్రాంతీయ భాషలలో మెటా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి వర్ధమాన, ఇప్పటికే ఉన్న వ్యవస్థాపకులకు డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా న్యూఢిల్లీలో మెటా సహకారంతో ‘ఎడ్యుకేషన్ టు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్: ఎంపవరింగ్ స్టూడెంట్స్, ఎడ్యుకేటర్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్’ కార్యక్రమాన్ని విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేశారు. యువకులను వారి విద్యాపరమైన పునాదిని అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలుగా మార్చడానికి ప్రేరేపించే యాత్రను పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రాథమిక లక్ష్యం అని కేంద్ర మంత్రి ప్రధాన్ వివరించారు. భారతదేశాన్ని ప్రపంచానికి నైపుణ్య రాజధానిగా మార్చడం, మన అమృత్ పీఠిని శక్తివంతం చేయాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు ఇది నిదర్శనమని తెలిపారు.

ఎడ్యుకేషన్ టు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ భాగస్వామ్యం అట్టడుగు స్థాయికి డిజిటల్ నైపుణ్యాన్ని తీసుకెళ్తుందని, టాలెంట్ అత్యున్నత సామర్థ్యాలను పెంపొందిస్తుందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. విద్యార్థులు, యువత, శ్రామికశక్తి, సూక్ష్మ పారిశ్రామికవేత్తలను భవిష్యత్ సాంకేతికతలతో అనుసంధానం చేసి అమృత్ పీఠంలా మారుస్తుందన్న మంత్రి ఈ కార్యక్రమాన్ని గేమ్ ఛేంజర్‌గా పేర్కొన్నారు. కొత్త-యుగం సమస్య పరిష్కారాలు-వ్యవస్థాపకుల లక్ష్యాన్ని వివరించారు.

NEPకి అనుగుణంగా, CBSE, AICTE, NUESBUDలతో మెటా భాగస్వామ్యం అనంతమైన అవకాశాలకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని MoS రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. క్లిష్టమైన డిజిటల్ నైపుణ్యాలతో జనాభాను సన్నద్ధం చేయడం, సూక్ష్మ పారిశ్రామికవేత్తలు, చిన్న వ్యాపారాలను బలోపేతం చేయడంతో ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుందని తెలిపారు. దేశాన్ని మార్చేందుకు యువతను సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, తద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో వారు విజయం సాధించేందుకు కీలకపాత్ర పోషిస్తారని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..