Supreme Court: నోయిడా ట్విన్‌ టవర్స్‌‌ను కూల్చాల్సిందే.. కీలక తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు

Supertech's Noida twin towers: నోయిడా లోని ట్విన్‌ టవర్స్‌ను కూల్చాల్సిందే అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఒక్క టవర్‌కు మినహాయింపు ఇవ్వాలన్న సూపర్‌టెక్‌ సంస్థ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది.

Supreme Court: నోయిడా ట్విన్‌ టవర్స్‌‌ను కూల్చాల్సిందే.. కీలక తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు
Supertech's Noida Twin Towers
Follow us

|

Updated on: Oct 04, 2021 | 7:35 PM

Supertech’s Noida twin towers: నోయిడా లోని ట్విన్‌ టవర్స్‌ను కూల్చాల్సిందే అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఒక్క టవర్‌కు మినహాయింపు ఇవ్వాలన్న సూపర్‌టెక్‌ సంస్థ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. ఢిల్లీ శివార్ల లోని నోయిడా అక్రమంగా నిర్మించిన ట్విన్‌ టవర్స్‌ విషయంలో సూపర్‌టెక్‌ బిల్డర్స్‌కు సుప్రీంకోర్టు మరోసారి షాకిచ్చింది. ట్విన్‌ టవర్స్‌ను తాము విధించిన గడువులోగా కూల్చాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

ఒక్క టవర్‌ను కూల్చివేత నుంచి మినహాయింపు ఇవ్వాలన్న సూపర్‌టెక్‌ బిల్డర్స్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆగస్ట్‌ 31న నోయిడా ట్విన్‌ టవర్స్‌పై కీలక తీర్పును వెల్లడించింది సుప్రీంకోర్టు. నోయిడా లోని ఎమిరాల్డ్‌ కోర్టు ప్రాజెక్ట్‌లో భాగంగా 40 అంతస్తుల ట్విన్‌ టవర్స్‌ను నిర్మించింది సూపర్‌టెక్‌ సంస్థ. అయితే నిబంధలను విరుద్దంగా ఈ టవర్స్‌ను నిర్మించారని , అధికారులు ముడుపులు తీసుకొని అనుమతులు ఇచ్చారని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై సుదీర్ఘంగా విచారణ జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు తరువాత నోయిడా డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారులపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ట్విన్‌ టవర్స్‌కు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంది యూపీ ప్రభుత్వం.

మరోవైపు, ట్విన్‌ టవర్స్‌లో ఫ్లాట్స్‌ బుకింగ్స్‌ చేసుకున్న ప్రజలకు డబ్బును వెంటనే చెల్లించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లోగా డబ్బులు చెల్లించాలని సూపర్‌ టెక్‌ బిల్డర్స్‌కు ఆదేశాలు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. ట్విన్‌ టవర్స్‌ను కూల్చివేస్తే కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని , పర్యావరణానికి కూడా హానీ జరుగుతుందన్న సూపర్‌టెక్‌ బిల్డర్స్ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. 2014లోనే ట్విన్‌ టవర్స్‌ను కూల్చేయాలని అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సూపర్‌టెక్‌ బిల్డర్స్‌ సుప్రీంకోర్టు వెళ్లినప్పటికి కూడా చుక్కెదురయ్యింది. నోయిడా అథారిటీకి చెందిన 26 మంది అధికారులకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్టు యూపీ ప్రభుత్వం నియమించిన దర్యాప్తు కమిటీ విచారణలో వెల్లడయ్యింది. అందులో కేవలం నలుగురు మాత్రమే ఇంకా సర్వీసులో ఉన్నారు. 20 మంది అధికారులు ఇప్పటికే రిటైర్‌ కాగా ఇద్దరు చనిపోయారు.

Read Also… క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్న యువత.. ప్రేమ పేరుతో నయవంచనకు గురై ఒకరు.. పేరెంట్స్ తింటారని మరొకరు..!

హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
అధినేత సమక్షంలోనే ఎడమొఖం పెడముఖంగా నేతలు
అధినేత సమక్షంలోనే ఎడమొఖం పెడముఖంగా నేతలు