AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satyendar Jain: ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ అరెస్ట్.. హవాలా కేసులో ఈడీ దర్యాప్తు..

సత్యేంద్ర అరవింద్ కేజ్రీవాల్‌కు సన్నిహితుడు కావడంతో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో దీనిపై హాట్‌హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. మంగళవారం, మే 31 మధ్యాహ్నం 2 గంటలకు సత్యేంద్రను రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు.

Satyendar Jain: ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ అరెస్ట్.. హవాలా కేసులో ఈడీ దర్యాప్తు..
Satyendar Jain
Venkata Chari
|

Updated on: May 31, 2022 | 6:02 AM

Share

ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. అవినీతి, హవాలా కేసులో జైన్‌పై విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారం కోల్‌కతాకు చెందిన కంపెనీకి సంబంధించింది అని తెలుస్తోంది. సత్యేంద్ర అరవింద్ కేజ్రీవాల్‌కు సన్నిహితుడు కావడంతో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో దీనిపై హాట్‌హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. మంగళవారం, మే 31 మధ్యాహ్నం 2 గంటలకు సత్యేంద్రను రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. జైన్‌కి రిమాండ్‌ ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది.

విచారణకు జైన్ సహకరించకపోవడంతో..

సత్యేంద్ర జైన్‌ అరెస్టుకు ప్రధాన కారణం.. విచారణలో ఈడీకి సహకరించకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని దర్యాప్తు సంస్థకు అందజేయడం లేదు. ఇప్పుడు ఈడీ సత్యేంద్రను కోర్టులో హాజరుపరిచి, విచారణ కోసం రిమాండ్‌ను కోరనుంది. తద్వారా ఈ హవాలా కేసును నిర్ధారించాలని చూస్తోంది. ఈ కేసు నడిచి దాదాపు ఎనిమిదేళ్లు కావస్తోంది. ఏప్రిల్ 5న భాస్కర్ సత్యేంద్ర జైన్‌పై ఈడీ కన్నేసింది.

మరోవైపు ఈ విషయంపై రాజకీయ రగడ కూడా మొదలైంది. ఇది నిజాయితీగల ప్రభుత్వానికి నిజాయితీ గల నాయకుడు అని బీజేపీ పేర్కొంది. మరోవైపు, ఇది ప్రతీకార చర్య అని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వ్యాఖ్యానించారు. ఎనిమిదేళ్లుగా తప్పుడు కేసు నడుస్తోందని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్‌లో జైన్ మా ఎన్నికల ఇన్‌చార్జి అని, అందుకే అరెస్టు చేశారంటూ తెలిపారు.

రెండు నెలల క్రితం రూ. 4.81 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్‌..

మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌తో జైన్ కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన స్థిరాస్తులు, సంస్థలను తాత్కాలికంగా అటాచ్ చేశారు. 2017 ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది. తర్వాత ఈ కేసును ఈడీకి బదిలీ చేశారు.

షెల్ కంపెనీల నుంచి రూ.4.81 కోట్లు..

ED ప్రకారం, 2015-16లో సత్యేందర్ జైన్ ప్రభుత్వోద్యోగి, ఆ తర్వాత కోల్‌కతాకు హవాలా ద్వారా నగదు బదిలీకి బదులుగా లాభదాయకంగా యాజమాన్యంలోని కంపెనీలు, అతని నియంత్రణలో ఉన్నాయని దర్యాప్తులో తేలింది. ఆధారిత ఎంట్రీ ఆపరేటర్లు.. షెల్ కంపెనీల నుంచి రూ. 4.81 కోట్లు వచ్చాయి. ED నివేదిక ప్రకారం, ఈ మొత్తాన్ని నేరుగా భూమిని కొనుగోలు చేయడానికి లేదా ఢిల్లీతోపాటు చుట్టుపక్కల వ్యవసాయ భూమి కొనుగోలు కోసం తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఉపయోగించారు.

Follow Us