AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: 135 సీట్లు గెలిచినా సంతృప్తి లేదు.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై కేపీసీసీ అధ్యక్షుడు, డిప్యూటి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మరోసారి స్పందించారు. తమ పార్టీ 135 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. తనకు సంతృప్తిగా లేదని అన్నారు. బెంగళూరులో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Karnataka: 135 సీట్లు గెలిచినా సంతృప్తి లేదు.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
DK Shivakumar
Aravind B
|

Updated on: May 22, 2023 | 4:27 AM

Share

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై కేపీసీసీ అధ్యక్షుడు, డిప్యూటి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మరోసారి స్పందించారు. తమ పార్టీ 135 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. తనకు సంతృప్తిగా లేదని అన్నారు. బెంగళూరులో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మరింత చురుగ్గా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇప్పటి నుంచి మరింత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.

అయితే కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 25 స్థానాలను గెలుచుకోగా.. కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఒక్కోస్థానాన్ని మాత్రమే దక్కించుకున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ బెంగళూరు రూరల్‌ను కైవసం చేసుకోగా.. హసన్‌ లోక్‌సభస్థానంలో జేడీఎస్‌ గెలిచింది. ఈసారి లింగాయత్‌, అహిందా వర్గాల ఓట్లు తమవైపు ఉండటంతో కాంగ్రెస్‌ ఉత్తమ ఫలితాలను ఆశిస్తోంది. మైనార్టీలు, దళితులు, వెనుకబడిన వర్గాలు అన్నీ అహిందా కిందికే వస్తాయి. బీజేపీకి గత కొంతకాలంగా అనుకూలంగా ఉంటున్న లింగాయత్‌ వర్గీయులు కూడా తాజా ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రజలు ఇదే విధానాన్ని కొనసాగిస్తారని కాంగ్రెస్‌ పార్టీ ఆశిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..