AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఆర్పీఎఫ్ బెటాలియన్ లో కరోనా కల్లోలం.. రెండు వారాల్లో 122 కేసులు

కరోనా వైరస్ క్రమంగా రక్షణ దళాల్లోనూ ప్రవేశించింది. కేవలం 2 వారాల్లో 122 కేసులు నమోదయ్యాయి. అస్సాం రాష్ట్రానికి చెందిన 55 ఏళ్ళ ఓ జవాన్ గతవారం ఢిల్లీలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో మరణించాడు. సుమారు వంద మంది జవాన్ల టెస్ట్ ఫలితాలు...

సీఆర్పీఎఫ్ బెటాలియన్ లో కరోనా కల్లోలం.. రెండు వారాల్లో 122  కేసులు
Umakanth Rao
| Edited By: |

Updated on: May 02, 2020 | 12:13 PM

Share

కరోనా వైరస్ క్రమంగా రక్షణ దళాల్లోనూ ప్రవేశించింది. కేవలం 2 వారాల్లో 122 కేసులు నమోదయ్యాయి. అస్సాం రాష్ట్రానికి చెందిన 55 ఏళ్ళ ఓ జవాన్ గతవారం ఢిల్లీలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో మరణించాడు. సుమారు వంద మంది జవాన్ల టెస్ట్ ఫలితాలు అందవలసి ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇన్ఫెక్షన్ ను అదుపు చేయలేకపోవడానికి దారి  తీసిన కారణాలను వివరించాలని కేంద్ర హోమ్ శాఖ సీఆర్పీఎఫ్ చీఫ్ ని కోరింది. తూర్పు ఢిల్లీ మయూర్ విహాం లోని 31 వ బెటాలియన్ కు చెందిన జవాన్లలో ఎక్కువమందికి కరోనా వైరస్ సోకినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఈ బెటాలియన్ లో 12 మందికి శుక్రవారం కరోనా పాజిటివ్ లక్షణాలు సోకాయి. అంతకు ముందే 45 మంది సిబ్బందికి కూడా ఈ వైరస్ సోకింది. ఒక నర్సింగ్ అసిస్టెంట్ నుంచి వీరందరికీ ఇది అంటుకున్నట్టు తెలుస్తోంది. బెటాలియన్ లోని అన్ని విభాగాలు శానిటైజర్ మెషిన్లను సమకూర్చుకోవాలని ఈ రక్షణ దళ చీఫ్ కోరారు.