మహారాష్ట్ర కూటమిలో బీటలు ? శరద్ పవార్ సీరియస్ !

మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మెల్లగా విభేదాల నీలినీడలు పరచుకుంటున్నాయి. శివసేన అధ్యక్షుడు, సీఎం ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల పట్ల ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎల్గార్ పరిషద్ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీకి అప్పగించాలని, ముస్లిములకు రిజర్వేషన్ కల్పించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఆయన.. వీటిపై చర్చించేందుకు ప్రభుత్వం లోని తమ పార్టీ మంత్రులతోను, పార్టీ నేతలతోనూ సోమవారం సమావేశమవుతున్నారు. శాంతి భద్రతల […]

మహారాష్ట్ర కూటమిలో బీటలు ? శరద్ పవార్ సీరియస్ !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 17, 2020 | 11:39 AM

మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మెల్లగా విభేదాల నీలినీడలు పరచుకుంటున్నాయి. శివసేన అధ్యక్షుడు, సీఎం ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల పట్ల ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎల్గార్ పరిషద్ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీకి అప్పగించాలని, ముస్లిములకు రిజర్వేషన్ కల్పించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఆయన.. వీటిపై చర్చించేందుకు ప్రభుత్వం లోని తమ పార్టీ మంత్రులతోను, పార్టీ నేతలతోనూ సోమవారం సమావేశమవుతున్నారు. శాంతి భద్రతల అంశం రాష్ట్ర పరిధిలోనిదని, ఒక రాష్ట్ర హక్కులను కేంద్ర పరిధిలోకి జొప్పించడం సరికాదని ఆయన భావిస్తున్నారు. అలాగే జాతీయ జనాభా గణన (ఎన్ పీ ఆర్) ప్రక్రియను మే 1 నుంచి అమలు చేయాలని  ఉధ్ధవ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఎన్సీపీ వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీలతో కలిసి ‘మహా వికాస్ ఆఘాడీ’ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన శరద్ పవార్.. ఇలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడాన్ని రాజకీయ పరిశీలకులు నిశితంగా పరిశీలిస్తున్నారు. 75 రోజుల ఉధ్ధవ్ ప్రభుత్వానికి కాంగ్రెస్, ఎన్సీపీలు ‘దెబ్బ కొట్టే’ యత్నంలో ఉన్నాయా అని భావిస్తున్నారు. సీఏఏ, జాతీయ జనాభా గణన చట్టాలను ఈ రెండు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా రెండో చట్టం అమలును ఆపివేయాలని కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గత జనవరిలోనే ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఎల్గార్ పరిషద్ కేసు 2017 నాటిది.. నాడు జనవరి 1 న భీమా-కోరేగావ్ కేసుతో ఇది ముడిపడి ఉంది. ఆ నాడు దళితులపై అగ్రవర్ణాల దాడులు, అనంతరం పౌర హక్కుల సంఘాల నేతల అరెస్టులు దేశంలో సంచలనం రేపాయి. వరవరరావు వంటి నేతలను పోలీసులు అరెస్టు చేసి గృహ నిర్బంధం విధించారు.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన