Covid Vaccine: బిచ్చగాళ్లు, నిరుపేదలు, నిరాశ్రయులకు కోవిడ్ వ్యాక్సిన్.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు..
Covid Vaccine: సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరించడంతో కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజూవారీ నమోదయ్యే పాజిటివ్ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్లోకి రాకపోగా.. మరికొన్ని ప్రాంతాల్లో థర్డ్ వేవ్ వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా కేంద్రం చర్యలు చేపడుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేష్ భూషణ్.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రెటరీలకు లేఖ రాశారు.
బిచ్చగాళ్లతో పాటు నిరుపేదలు, అనాధలు, రిహాబ్ క్యాంపుల్లో ఉండేవారికి తక్షణమే కోవిడ్ వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ”స్వీయ-రిజిస్ట్రేషన్ అందుబాటులో లేనివారితో పాటు టీకాలు వేయడానికి వనరులు లేని నిరాశ్రయులకు వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉంది. ఈ సమూహాలకు టీకాలు వేసేందుకు తగిన విధానాన్ని అవలంభించాలని” కేంద్రం లేఖలో పేర్కొంది.
Also Read:
14 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డ సన్రైజర్స్ ఓపెనర్.!
ధైర్యమంటే ఇదేనేమో.. భారీ నాగుపాముతో యువతి సయ్యాట.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
ధావన్ స్థానాన్ని భర్తీ చేసేది ధోని శిష్యుడు మాత్రమే.. తెగేసి చెప్పిన మాజీ క్రికెటర్..
ఈ ఫోటోలో ఎన్ని పులులు ఉన్నాయో కనుక్కోండి.? కనిపెట్టలేదా.! అయితే ఈ స్టోరీ చదవండి!