AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress List: కాంగ్రెస్ మూడో జాబితా విడుదల.. తెలంగాణలో ఐదుగురికి చోటు..

పార్లమెంట్ ఎన్నికలకు మరో 57 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు దక్కింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి స్థానం నుంచి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ బరిలో దానం నాగేందర్ కు అవకాశం కల్పించిన కాంగ్రెస్ హైకమాండ్.

Congress List: కాంగ్రెస్ మూడో జాబితా విడుదల.. తెలంగాణలో ఐదుగురికి చోటు..
Congress Party
Balaraju Goud
|

Updated on: Mar 21, 2024 | 9:51 PM

Share

పార్లమెంట్ ఎన్నికలకు మరో 57 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు దక్కింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి స్థానం నుంచి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ బరిలో దానం నాగేందర్, చేవెళ్ల నియోజకవర్గం నుంచి రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గానికి గాను మల్లు రవిని అభ్యర్థులుగా ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం.

పెద్దపల్లి – గడ్డం వంశీ

సికింద్రాబాద్ – దానం నాగేందర్

మల్కాజిగిరి – సునీత మహేందర్ రెడ్డి

నాగర్ కర్నూల్ – మల్లు రవి

చేవెళ్ల – గడ్డం రంజిత్ రెడ్డి

రాబోయే లోక్‌సభ ఎన్నికలకు గానూ ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 57 మంది అభ్యర్థులతో కూడిన అభ్యర్థుల మూడవ జాబితాను కాంగ్రెస్ గురువారం విడుదల చేసింది. ఇక బెంగళూరు నార్త్ నుంచి రాజ్యసభ మాజీ సభ్యుడు ఎంవీ రాజీవ్ గౌడ, గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేత అమిత్ చావ్డా గుజరాత్ ఆనంద్ నుంచి బరిలోకి దిగనున్న కీలక అభ్యర్థుల్లో ఉన్నారు.

అంతకుముందు కాంగ్రెస్ 43 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం నాలుగు రాష్ట్రాల నుంచి సిట్టింగ్ లోక్ సభ ఎంపీ, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్ రాష్ట్రంలోని జోర్హాట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సిఎం కమల్ నాథ్ కుమారుడు నకుల్ ప్రస్తుతం కుటుంబానికి కంచుకోటగా భావించే చింద్వారా నుండి పోటీ చేయనున్నారు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ జలోర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

దావోస్‌లో ఏపీకి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు.. లక్ష ఉద్యోగాలు
దావోస్‌లో ఏపీకి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు.. లక్ష ఉద్యోగాలు
'ధురంధర్'కు మించి కలెక్షన్లు.. ఇప్పుడు OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
'ధురంధర్'కు మించి కలెక్షన్లు.. ఇప్పుడు OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
బీసీసీఐ అయితే ఎవరికి గొప్ప..బంగా మంత్రి తలబిరుసు మాటలు
బీసీసీఐ అయితే ఎవరికి గొప్ప..బంగా మంత్రి తలబిరుసు మాటలు
రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోందిః హరీష్ రావు
రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోందిః హరీష్ రావు
గురు వక్రంతో ఆ రాశుల వారి ఆదాయానికి రెక్కలు..!
గురు వక్రంతో ఆ రాశుల వారి ఆదాయానికి రెక్కలు..!
ఈ ఫోన్ 9000mAh బ్యాటరీ.. 200MP కెమెరాతో.. అప్‌గ్రేడ్‌ ఫీచర్స్‌!
ఈ ఫోన్ 9000mAh బ్యాటరీ.. 200MP కెమెరాతో.. అప్‌గ్రేడ్‌ ఫీచర్స్‌!
డిజాస్టర్ హీరో.. అట్టర్ ఫ్లాప్ హీరోయిన్.. ఎందుకు దొరకడో చూద్దాం
డిజాస్టర్ హీరో.. అట్టర్ ఫ్లాప్ హీరోయిన్.. ఎందుకు దొరకడో చూద్దాం
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
బనానా పాన్‌కేక్స్.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్ ఇదే!
బనానా పాన్‌కేక్స్.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్ ఇదే!
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌!
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌!