AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ నిర్భయ ‘ కేసులో దోషులకు తప్పని ఉరి ? క్యురేటివ్ పిటిషన్ అంటే ?

నిర్భయ కేసులో నలుగురు దోషులను  ఈ నెల 22 వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు తీర్పునిచ్చింది. ముకేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ సింగ్ అనే వీరిని  ఆ రోజున  ఉరి తీయనున్నారు. వీరి రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇదివరకే తోసిపుచ్చింది. వినయ్ శర్మ మెర్సీ పిటిషన్‌ను రాష్ట్రపతి కూడా తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దోషి.. సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు […]

' నిర్భయ ' కేసులో దోషులకు తప్పని ఉరి  ? క్యురేటివ్ పిటిషన్ అంటే ?
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 09, 2020 | 2:13 PM

Share

నిర్భయ కేసులో నలుగురు దోషులను  ఈ నెల 22 వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు తీర్పునిచ్చింది. ముకేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ సింగ్ అనే వీరిని  ఆ రోజున  ఉరి తీయనున్నారు. వీరి రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇదివరకే తోసిపుచ్చింది. వినయ్ శర్మ మెర్సీ పిటిషన్‌ను రాష్ట్రపతి కూడా తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దోషి.. సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. పాటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పు పక్షపాతపూరితంగా ఉందని అందులో పేర్కొన్నాడు.

రివ్యూ పిటిషన్ అంటే ?

ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఇచ్ఛే తీర్పే ఫైనల్.. అయితే రాజ్యాంగంలోని 137 అధికరణం కింద సుప్రీంకోర్టు తానిఛ్చిన తీర్పును తానే తిరిగి సమీక్షించవచ్ఛు. ఇందుకు కోర్టుకు అధికారాలు ఉన్నాయి. ఇదివరకు ఇఛ్చిన తీర్పులో ఏవైనా పొరబాట్లు ఉన్న పక్షంలో వాటిని కోర్టు సరిదిద్దుతుంది. పైగా పిటిషనర్ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్ఛు.

ఇక క్యురేటివ్ పిటిషన్ అంటే ?

ఈ పిటిషన్ ద్వారా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు సంబంధించి రెండో రివ్యూకు ఇది ఆస్కారం కల్పిస్తుంది. 2002 లో రూపా అశోక్ హుర్రా వర్సెస్ అశోక్ హుర్రా కేసులో అయిదుగురు న్యాయమూర్తులతో  కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. కోర్టు తన తుది తీర్పులో ఏదైనా ‘ మిస్ క్యారేజ్ ఆఫ్ జస్టిస్ ‘ (న్యాయం సరిగా జరగలేదని) ఉందని  భావిస్తే దానిని సరిదిద్దుకోవచ్ఛునని స్పష్టం చేసింది. అలాంటపుడు బాధితుడు (దోషి) దాఖలు చేసే క్యురేటివ్ పిటిషన్‌ని కోర్టు అనుమతిస్తుంది. తుది తీర్పును లిటిగెంట్స్ సవాలు చేయజాలరని కోర్టు పేర్కొన్నప్పటికీ.. ఒక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పక్షపాతపూరితంగా ఉందని, అది సహజ న్యాయ సూత్రానికి విరుద్ధంగా ఉందని ఈ పిటిషన్‌లో అతగాడు అభిప్రాయపడవచ్ఛు. రాష్ట్రపతి అతని మెర్సీ పిటిషన్‌ని తిరస్కరించినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం మళ్ళీ దాన్ని సమీక్షించవచ్ఛుకూడా.ఇలా ఉండగా నిర్భయ కేసులో  దోషి అయిన వినయ్ శర్మ గురువారం సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. మరోవైపు..తీహార్ జైలు  అధికారులు ‘ డమ్మీ ఉరి ‘ సన్నాహాలను ఈ జైలు 3 వ భాగంలో నిర్వహించనున్నారు. ఉరి తీసేముందు అతని కుటుంబ సభ్యులతో ఒకసారి మాత్రం మాట్లాడనిస్తారు. పైగా ఉరి తీసే వ్యక్తిని ఏకాంతంగా ఒక సెల్‌లో ఉంచుతారు.