AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Historic Places: ఇండియాలో ఈ 10 పర్యాటక ప్రదేశాల్లో పర్యటించడం నిషేధం.. ఎందుకో తెలుసా..? ఎవ్వరికీ తెలియని నిజాలు ఇవే..

ఇండియా అందమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ప్రతీ రాష్ట్రంలో సందర్శించేందుకు అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు ఎంతో చరిత్రను కలిగి ఉన్నాయి. కానీ దేశంలో సందర్శించడానికి వీల్లేని ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వీటిల్లోకి బయట ప్రజలకు అనుమతి ఉండదు.

Venkatrao Lella
|

Updated on: Jan 12, 2026 | 7:35 PM

Share
భారతదేశంలో చాలా అందమైన చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. ఎన్నో బ్యూటిఫుల్, ఆహ్లాదాన్ని కలిగించే పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కానీ కొన్ని ప్రదేశాలను ప్రజలు సందర్శించడానికి వీల్లేకుండా బ్యాన్ విధించారు. పర్యావరణ కారణాలు, భద్రత, గిరిజనుల రక్షణ కోసం కొన్ని ప్రాంతాల సందర్శనపై నిషేధం అమల్లోకి ఉంది. అలాంటి 10 ప్రదేశాల గురించి ఇందులో తెలుసుకుందాం.

భారతదేశంలో చాలా అందమైన చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. ఎన్నో బ్యూటిఫుల్, ఆహ్లాదాన్ని కలిగించే పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కానీ కొన్ని ప్రదేశాలను ప్రజలు సందర్శించడానికి వీల్లేకుండా బ్యాన్ విధించారు. పర్యావరణ కారణాలు, భద్రత, గిరిజనుల రక్షణ కోసం కొన్ని ప్రాంతాల సందర్శనపై నిషేధం అమల్లోకి ఉంది. అలాంటి 10 ప్రదేశాల గురించి ఇందులో తెలుసుకుందాం.

1 / 5
అండమాన్ నికోబార్‌లోని నార్త్ సెంటినెల్ ద్వీపంలో బయటి ప్రజలకు అనుమతి లేదు. అక్కడ నివసించే సెంటినెల్ తెగ ప్రజల రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక రాజస్థాన్‌లోని భంగార్ కోట మధ్యాహ్నం వేళల్లో తెరిచి ఉంటుంది కానీ భద్రతా కారణాల వల్ల రాత్రి పూట నిషేధం విధించారు. అటు లడఖ్‌లోని సియాచిన్ గ్లేసియర్ సందర్శించేందుకు సామాన్య ప్రజలకు అనుమతి లేదు.

అండమాన్ నికోబార్‌లోని నార్త్ సెంటినెల్ ద్వీపంలో బయటి ప్రజలకు అనుమతి లేదు. అక్కడ నివసించే సెంటినెల్ తెగ ప్రజల రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక రాజస్థాన్‌లోని భంగార్ కోట మధ్యాహ్నం వేళల్లో తెరిచి ఉంటుంది కానీ భద్రతా కారణాల వల్ల రాత్రి పూట నిషేధం విధించారు. అటు లడఖ్‌లోని సియాచిన్ గ్లేసియర్ సందర్శించేందుకు సామాన్య ప్రజలకు అనుమతి లేదు.

2 / 5
అలాగే అస్సాంలోని బర్తెల్ వన్యప్రాణాలు అభయారణ్యంలో సామాన్య ప్రజలకు అనుమతి లేదు. ఇక సిక్కింలోని మౌంట్ కాంచన్ జంగా శిఖర ప్రాంతంతో పాటు గిరిజనుల రక్షణ దృష్ట్యా నికోబార్ దీవుల్లోని చాలా ప్రాంతాలను సందర్శించడానికి వీల్లేదు. అలాగే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని కొన్ని ప్రాంతాలను ప్రొటోకాల్ కారణంగా సామాన్యులకు ఎంట్రీ ఉండదు.

అలాగే అస్సాంలోని బర్తెల్ వన్యప్రాణాలు అభయారణ్యంలో సామాన్య ప్రజలకు అనుమతి లేదు. ఇక సిక్కింలోని మౌంట్ కాంచన్ జంగా శిఖర ప్రాంతంతో పాటు గిరిజనుల రక్షణ దృష్ట్యా నికోబార్ దీవుల్లోని చాలా ప్రాంతాలను సందర్శించడానికి వీల్లేదు. అలాగే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని కొన్ని ప్రాంతాలను ప్రొటోకాల్ కారణంగా సామాన్యులకు ఎంట్రీ ఉండదు.

3 / 5
మహారాష్ట్ర-యూపీ సరిహద్దుల్లోని చంబర్ నది లోయలు, అరుణాచల్ ప్రదేశ్‌లోని భారత్-చైనా వ్యూహత్మక సరిహద్దుల్లో బయట ప్రజలకు అనుమతి లేదు. అటు మధ్య భారతదేశంలో గిరిజనులు రక్షిస్తున్న పవిత్ర గిరిజన తోటలు సంస్కృతి, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.

మహారాష్ట్ర-యూపీ సరిహద్దుల్లోని చంబర్ నది లోయలు, అరుణాచల్ ప్రదేశ్‌లోని భారత్-చైనా వ్యూహత్మక సరిహద్దుల్లో బయట ప్రజలకు అనుమతి లేదు. అటు మధ్య భారతదేశంలో గిరిజనులు రక్షిస్తున్న పవిత్ర గిరిజన తోటలు సంస్కృతి, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.

4 / 5
స్థానిక ఆచారాల ద్వారా ఈ గిరిజన తోటలు సంరక్షించబడుతున్నాయి. దీంతో ఈ అటవీ ప్రాంతాలను సందర్శించడానికి బయటి వ్యక్తులకు అనుమతి ఉండదు. కేవలం అక్కడ నివసించే గిరిజనులు మాత్రమే అక్కడ తిరిగేందుకు అనుమతి ఉంది.

స్థానిక ఆచారాల ద్వారా ఈ గిరిజన తోటలు సంరక్షించబడుతున్నాయి. దీంతో ఈ అటవీ ప్రాంతాలను సందర్శించడానికి బయటి వ్యక్తులకు అనుమతి ఉండదు. కేవలం అక్కడ నివసించే గిరిజనులు మాత్రమే అక్కడ తిరిగేందుకు అనుమతి ఉంది.

5 / 5