AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

By Polls 2021: దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 29 అసెంబ్లీ.. 3 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు ఈరోజే..

దేశవ్యాప్తంగా ఈరోజు 13 రాష్ట్రాల్లో 3 లోక్‌సభ..29 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఎన్నికలు జరుగుతున్న అన్ని స్థానాల్లోనూ కోవిడ్ భద్రతా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహించనున్నారు.

By Polls 2021: దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 29 అసెంబ్లీ.. 3 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు ఈరోజే..
By Polls 2021
KVD Varma
|

Updated on: Oct 30, 2021 | 8:30 AM

Share

By Polls 2021: దేశవ్యాప్తంగా ఈరోజు 13 రాష్ట్రాల్లో 3 లోక్‌సభ..29 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఎన్నికలు జరుగుతున్న అన్ని స్థానాల్లోనూ కోవిడ్ భద్రతా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోరు సాగనుంది. దాద్రా-నగర్ హవేలీ, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి, మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా ఉప ఎన్నికలు జరగనున్న 29 అసెంబ్లీ స్థానాల్లో అస్సాంలో ఐదు, పశ్చిమ బెంగాల్‌లో 4, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో మూడేసి నియోజకవర్గాలు, బీహార్, కర్ణాటక, రాజస్థాన్‌లలో రెండు చొప్పున, ఆంధ్రప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు నవంబర్ 2న జరుగుతుంది.

ఉప ఎన్నికలు జగరనున్న పార్లమెంట్ నియోజకవర్గాలు ఇవే..

నాగాలాండ్‌లోని షామటోర్-చెస్సోర్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక ప్రకటించినప్పటికీ, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అభ్యర్థి ఎస్ కెయోషు యిమ్‌చుంగర్ అక్టోబర్ 13న పోటీ లేకుండా ఎన్నికైనట్లు ప్రకటించారు. మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్‌ సభ్యులు మరణించారు. మార్చిలో రామస్వరూప్ శర్మ (బిజెపి) మరణంతో మండి స్థానం ఖాళీ అయింది.

బీజేపీ సభ్యుడు నంద్ కుమార్ సింగ్ చౌహాన్ మరణంతో ఖాండ్వా పార్లమెంటరీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరం కాగా దాద్రా – నగర్ హవేలీలో స్వతంత్ర లోక్‌సభ సభ్యుడు మోహన్ డెల్కర్ మృతి చెందాడంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది.

ఉప ఎన్నికలు జగరనున్న అసెంబ్లీ స్థానాలు ఇవే..

  • అస్సాంలో గోస్సైగావ్, భబానీపూర్, తముల్‌పూర్, మరియాని, తౌరా స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీజేపీ మూడు స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది, మిగిలిన రెండింటిని కూటమి భాగస్వామి యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్‌కు వదిలిపెట్టింది. కాంగ్రెస్ మొత్తం ఐదు స్థానాల్లో తన అబ్యార్థులను నిలబెట్టగా, దాని మాజీ మిత్రపక్షాలు ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్,బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ వరుసగా రెండు అలాగే, ఒక స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణంతో గోస్సైగావ్, తముల్‌పూర్‌లలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి., భబానీపూర్, మరియాని అలాగే, తౌరా అధికార బీజేపీలో చేరేందుకు తమ స్థానాలకు రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానాల్లో మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ స్థానాల్లో ఎన్నికైన ఎమ్మెల్యేలు రూపజ్యోతి కుర్మీ , సుశాంత బోర్గోహైన్ కాంగ్రెస్‌కు, అలాగే ఫణిధర్ తాలుక్‌దార్ ఏఐయూడీఎఫ్ (AIUDF) నుండి రాజీనామా చేసి ఇప్పుడు బిజెపి టిక్కెట్‌పై పోరాడుతున్నారు.
  • పశ్చిమ బెంగాల్‌లోని నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాలకు ఉపఎన్నికలు జరగనుండగా, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఉదయన్ గుహా ఏప్రిల్ ఎన్నికలలో బీజేపీ తన నుండి కైవసం చేసుకున్న సీటును తిరిగి కైవసం చేసుకోవాలని చూస్తున్న దిన్‌హటాపై అందరి దృష్టి ఉంది. ఇక్కడ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి నిసిత్ తన లోక్‌సభ సభ్యత్వాన్ని నిలుపుకోవాలని నిర్ణయించుకుని తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడంతో దిన్‌హటాకు ఉప ఎన్నిక అనివార్యమైంది.
  • పోలింగ్ జరగనున్న ఇతర మూడు స్థానాలు నదియా జిల్లాలోని శాంతిపూర్, ఉత్తర 24 పరగణాల్లోని ఖర్దా, దక్షిణ 24 పరగణాల్లోని గోసబా. శాంతిపూర్‌లో కూడా బీజేపీ ఎంపీ జగన్నాథ్ సర్కార్ అసెంబ్లీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల వలసలతో సతమతమవుతున్న బీజేపీకి దిన్‌హటా, శాంతిపూర్‌లకు జరిగే ఉప ఎన్నికలు ప్రతిష్ఠాత్మక పోరుగా భావిస్తున్నాయి.
  • మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా లోక్‌సభ నియోజకవర్గంతో పాటు జోబాట్ (ఎస్‌టీ), రాయ్‌గావ్ (ఎస్సీ), పృథ్వీపూర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
  • రాజస్థాన్‌లోని వల్లభ్‌నగర్, ధరియావాడ్ ఉప ఎన్నికలు అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ముఖ్యమైన పరీక్షగా పరిగణిస్తున్నారు.
  • ప్రభుత్వ సుస్థిరత దృష్ట్యా ఉప ఎన్నికలకు వెళ్లే నియోజకవర్గాల సంఖ్య కీలకం కానప్పటికీ, గత ఏడాది డిప్యూటీ సీఎం తిరుగుబాటు కారణంగా పెద్ద ముప్పును ఎదుర్కొన్న ప్రభుత్వ పనితీరుపై ఫలితాలు రాష్ట్రవ్యాప్తంగా సందేశాన్ని పంపుతాయి. ముఖ్యమంత్రి సచిన్ పైలట్, ఆయన నేతృత్వంలోని 18 మంది ఎమ్మెల్యేలు.
  • హర్యానాలోని సిర్సా జిల్లాలోని ఎల్లెనాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో ముక్కోణపు పోటీ ఉంది. ప్రతిపక్ష ఇండియన్ నేషనల్ లోక్ దళ్‌కు చెందిన అభయ్ సింగ్ చౌతాలా, వ్యవసాయ చట్టాల సమస్యపై రాజీనామా చేయడంతో ఇక్కడ ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. ఎల్లెనాబాద్‌లోని ప్రధాన భాగం గ్రామీణ ప్రాంతం కావడంతో ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడుతున్నారు కాబట్టి మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలు కీలక సమస్యగా మారాయి.
  • వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ, అర్కీ, ఫతేపూర్ అలాగే జుబ్బల్-కోట్‌ఖాయ్ విధానసభ స్థానాలకు ఉప ఎన్నికలు కీలకంగా మారాయి. ఉప ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని స్థానిక కాంగ్రెస్, బీజేపీ నేతలు చెబుతున్నారు.
  • తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. ఆరోపణలతో రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో జూన్‌లో ఈటల రాజేందర్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆరోపణలను తోసిపుచ్చిన రాజేందర్ టీఆర్‌ఎస్‌ని వీడి బీజేపీలో చేరారు. ఆయన మళ్లీ బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీకి.. అలాగే, రాజేందర్‌కు ఈ ఉపఎన్నిక డూ ఆర్ డై యుద్ధంగా పరిగనిస్తున్నారు. ఇది టీఆర్‌ఎస్‌కు కూడా కీలకంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో తన ఆధిపత్యం అప్రతిహతంగా కొనసాగుతోందని నిరూపించుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.
  • ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ స్థానంలో కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండడంతో అధికార వైఎస్సార్సీపీ గెలుపు నల్లేరుపై నడకలా సాగనుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బిఎస్ యడియూరప్ప స్థానంలో ముఖ్యమంత్రిగా కొలువుతీరిన బసవరాజ్ బొమ్మైకి కర్ణాటకలోని హనగల్, సింద్గి నియోజకవర్గాల ఉప ఎన్నికలు మొదటి ఎన్నికల పరీక్షగా నిలిచాయి.
  • బీహార్‌లోని తారాపూర్, కుశేశ్వర్ నియోజకవర్గాలకూ, మేఘాలయలోని రాజబాలా, మావ్రింగ్‌క్‌నెంగ్, మాఫ్‌లాంగ్ సీట్లలోనూ, మహారాష్ట్రలోని డెగ్లూర్ అదేవిధంగా మిజోరంలోని తుయిరియల్ అసెంబ్లీ స్థానాల్లోనూ ఉప ఎన్నికలు జగరనున్నాయి.

ఇవి కూడా చదవండి: Huzurabad by election: కాయ్ రాజా కాయ్.. మంచి తరుణం మించిన దొరకదు..

Telangana: తెలంగాణలో పుర కమిషనర్ల బదిలీలు.. ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి..

Puneeth Rajkumar Death: మొన్న సిద్ధార్థ్ శుక్లా.. నేడు పునీత్ రాజ్‌కుమార్‌.. ప్రాణాలు తీస్తోన్న ఓవర్ వర్కవుట్స్ !

Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. వెతకబోయిన తీగ కాలికి తగిలింది
Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. వెతకబోయిన తీగ కాలికి తగిలింది
Viral Video: దోస్త్‌ మేరా దోస్త్‌.. 8 వేల మైళ్లు ప్రయాణించి...
Viral Video: దోస్త్‌ మేరా దోస్త్‌.. 8 వేల మైళ్లు ప్రయాణించి...
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
ఓ మహిళతో ప్రేమ.. మరో మహిళతో నిశ్చితార్థం.. చివరకు..
ఓ మహిళతో ప్రేమ.. మరో మహిళతో నిశ్చితార్థం.. చివరకు..
చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!