AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జలసమాధి.. విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి

మ్మూ కాశ్మీర్‌లోని హంద్వారాలో భారీ వర్షాల కారణంగా నగరం జలమయమైంది. ఒకవైపు ఎగువ ప్రాంతాల్లో మంచు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా, మరోవైపు దిగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. దీని కారణంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రానున్న రోజుల్లో జమ్మూకశ్మీర్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

జలసమాధి.. విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
Boat capsizes in Jhelum river
Jyothi Gadda
|

Updated on: Apr 16, 2024 | 11:27 AM

Share

జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని జీలం నదిలో పడవ బోల్తా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. శ్రీనగర్‌లోని గండబాల్-బట్వారా ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. కొందరు కార్మికులు, పాఠశాల విద్యార్థులు పడవలో ఉన్నారు. ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న పోలీసు స్క్వాడ్ వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. శ్రీనగర్‌లోని SMHS హాస్పిటల్ సూపరింటెండెంట్, డాక్టర్ ముజఫర్ జర్గర్ మాట్లాడుతూ, ఆసుపత్రికి తీసుకువచ్చిన ఏడుగురిలో నలుగురు మరణించారు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. ఘటన వార్త తెలిసిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందాన్ని సంఘటనా స్థలంలో మోహరించినట్లు అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జీలంతోపాటు పలు నీటి వనరుల నీటిమట్టం పెరిగింది.

జమ్మూ కాశ్మీర్‌లో వర్షం, హిమపాతం కొనసాగుతుంది. ఈ కారణంగానే నదుల నీటిమట్టం రోజురోజుకూ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పూంచ్-రాజౌరీ జిల్లాలను నేరుగా కాశ్మీర్‌కు కలిపే మొఘల్ రహదారిపై మళ్లీ మంచు కురిసింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. అదే సమయంలో, జమ్మూ కాశ్మీర్‌లోని హంద్వారాలో భారీ వర్షాల కారణంగా నగరం జలమయమైంది. ఒకవైపు ఎగువ ప్రాంతాల్లో మంచు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా, మరోవైపు దిగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. దీని కారణంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రానున్న రోజుల్లో జమ్మూకశ్మీర్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ కాలంలో ఉత్తర భారతదేశంలో పాశ్చాత్య డిస్టర్బెన్స్ చురుకుగా ఉంటుంది. ఈరోజు కూడా ఎగువ ప్రాంతాల్లో మంచు కురుస్తుందని, దిగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ 20 నుంచి లోయలో వాతావరణం మళ్లీ మారనుంది. దీని కారణంగా స్థానిక ప్రజలు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..