AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కోడి గుడ్డు కోసం లక్షలు.. మూడు రోజుల పాటు జరిగిన వేలం.. ఎగబడ్డ జనం

ఇక్కడ మసీదు నిర్మాణం కోసం కమిటీ ద్వారా నగదు, వస్తు రూపంలో విరాళాలు సేకరించబడ్డాయి. ఇందులో కలప, ఇటుకలు, సిమెంటు, టిన్‌ షీట్లు తదితర వస్తువులను ప్రజలు విరాళంగా అందజేశారు. ఈ సమయంలో ఒక వృద్ధ మహిళ తన కోడి పెట్టిన తాజా గుడ్డును దానం చేసింది. ఏది ఏమైనా గుడ్డును చివరిసారి వేలం వేసి ఓ యువకుడు భారీ మొత్తానికి కొనుగోలు చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి.

Viral News: కోడి గుడ్డు కోసం లక్షలు.. మూడు రోజుల పాటు జరిగిన వేలం.. ఎగబడ్డ జనం
Egg Donated For Mosque
Jyothi Gadda
|

Updated on: Apr 16, 2024 | 12:47 PM

Share

జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఒక ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ మసీదు నిర్మాణానికి విరాళంగా అందజేసిన గుడ్డు కొన్ని లక్షలకు వేలంలో అమ్ముడు పోయింది. ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్‌లోని మల్పోరా గ్రామంలో ఆసక్తికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీనగర్‌కు 55 కిలోమీటర్ల దూరంలోని సోపోర్ పరిధిలోని మల్పోరా గ్రామంలో మసీదు నిర్మాణం కోసం ఒక గుడ్డును విరాళంగా ఇచ్చారు. ఈ గుడ్డు వేలంలో రూ.2 లక్షలకు పైగా పలికింది. ఇక్కడ మసీదు నిర్మాణానికి నిధులు సేకరించేందుకు విరాళంగా ఇచ్చిన గుడ్డు వేలంలో రూ.2.26 లక్షలు సమకూరింది. ఈ సమాచారాన్ని సదరు కమిటీ తెలిపింది. విషయం ఏంటంటే.. మల్పోరా గ్రామంలో మసీదు నిర్మించే పనులు చేపట్టారు. అటువంటి పరిస్థితిలో, స్థానిక మసీదు కమిటీ నిర్మాణ పనుల కోసం నగదు, వస్తు రూపంలో విరాళాలు సేకరించడం ప్రారంభించింది.

వృద్ధురాలు విరాళం ఇచ్చిన కోడి గుడ్డు..

ఇవి కూడా చదవండి

ఇంతలో, ఒక వృద్ధ మహిళ తన కోడి పెట్టిన తాజా గుడ్డును దానం చేస్తున్నట్టుగా చెప్పింది. దాంతో వృద్ధురాలు ఇచ్చిన ఈ గుడ్డును కూడా వేలంలో వస్తువుగా పెట్టారు. వేలం సమయంలో ఈ గుడ్డు ఎంతో మందిని ఆకర్షించింది. కేవలం ఐదు నుంచి ఏడు రూపాయల ధర ఉన్న ఈ గుడ్డు వేలంలో ఎక్కువ డిమాండ్‌ పలికింది. ఏకంగా మూడు రోజుల పాటు ఈ గుడ్డుపై వేలం కొనసాగింది. చివరకు వేలం చివరి రోజు డానిష్ అహ్మద్ అనే యువ వ్యాపారి కోడిగుడ్డును రూ.70 వేలకు కొనుగోలు చేశాడు. ఆ తరువాత ఈ గుడ్డు వేలంలో చాలాసార్లు కొనుగోలు చేయబడింది. చివరకు మొత్తం ధర రూ.2 లక్షల 26 వేల 350గా చేరిందని కమిటీ వెల్లడించింది.

ఈ ఘటన సోపోర్‌లోని మాల్‌పూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఇక్కడ మసీదు నిర్మాణం కోసం కమిటీ ద్వారా నగదు, వస్తు రూపంలో విరాళాలు సేకరించబడ్డాయి. ఇందులో కలప, ఇటుకలు, సిమెంటు, టిన్‌ షీట్లు తదితర వస్తువులను ప్రజలు విరాళంగా అందజేశారు. ఈ సమయంలో ఒక వృద్ధ మహిళ తన కోడి పెట్టిన తాజా గుడ్డును దానం చేసింది. ఏది ఏమైనా గుడ్డును చివరిసారి వేలం వేసి ఓ యువకుడు భారీ మొత్తానికి కొనుగోలు చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. బంగారం ధర భారీగా తగ్గనుందా?
అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. బంగారం ధర భారీగా తగ్గనుందా?
సూర్యకాంతం చనిపోతే ఎవరూ ఎందుకు వెళ్ళలేదంటే..?
సూర్యకాంతం చనిపోతే ఎవరూ ఎందుకు వెళ్ళలేదంటే..?
సండే స్పెషల్.. హైదరాబాదీ చికెన్ గ్రేవీ. ఇలా వండితే అదిరిపోద్దీ!
సండే స్పెషల్.. హైదరాబాదీ చికెన్ గ్రేవీ. ఇలా వండితే అదిరిపోద్దీ!
ఫారెస్ట్-టు-టేబుల్ భోజనం! భూమి పెడ్నేకర్ నేచర్ టూర్
ఫారెస్ట్-టు-టేబుల్ భోజనం! భూమి పెడ్నేకర్ నేచర్ టూర్
ప్రమాదంలో కోహ్లీ రికార్డ్.. తొక్కి పడేసేందుకు సిద్ధమైన 5గురు?
ప్రమాదంలో కోహ్లీ రికార్డ్.. తొక్కి పడేసేందుకు సిద్ధమైన 5గురు?
సినిమా డిజాస్టర్ అని చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. కట్ చేస్తే
సినిమా డిజాస్టర్ అని చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. కట్ చేస్తే
త్వరలో నంది అవార్డులు.. టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త
త్వరలో నంది అవార్డులు.. టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త
రోబో సినిమాలో రజనీకాంత్‌లా క్షణ్లాలో స్టోరీ చదివేయొచ్చు!
రోబో సినిమాలో రజనీకాంత్‌లా క్షణ్లాలో స్టోరీ చదివేయొచ్చు!
గుండెను పదిలంగా ఉంచుకోవడానికి నిపుణుల చిట్కాలివే!
గుండెను పదిలంగా ఉంచుకోవడానికి నిపుణుల చిట్కాలివే!
ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. సీజన్‌కు ముందే ఇబ్బందుల్లో 9 జట్లు..?
ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. సీజన్‌కు ముందే ఇబ్బందుల్లో 9 జట్లు..?