Budget 2025: అసెంబ్లీ ఎన్నికల వేళ బిహార్కు వరాల జల్లు.. భారీగా కేటాయింపులు..
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్కు కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు ప్రకటించింది. కేంద్ర బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేశారు. బిహార్లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు నిర్మలా సీతారామన్.. దీనిద్వారా.. బీహార్ రైతులకు భారీగా లబ్ది చేకూరనుంది.

దేశంలో కొత్తగా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని తీసుకొస్తున్నట్లు నిర్మలాసీతారామన్ ప్రకటించారు. దీని ద్వారా దేశంలో వెనుకబడిన వంద జిల్లాల్లో వ్యవసాయ రంగ ప్రోత్సాహానికి ఉపయోగపడుతుందని చెప్పారు. కోటి 70లక్షల మంది గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు నిర్మలాసీతారామన్. దేశంలో 10 విస్తృత రంగాలపై కేంద్రం దృష్టి సారిస్తుందన్నారు. వీటి ద్వారా వ్యవసాయ వృద్ధితోపాటు ఉత్పదకత పెరుగుతుందని తెలిపారు. వ్యవసాయం, MSME, పెట్టుబడులు, ఎగుమతి రంగాలను పవర్ఫుల్ ఇంజిన్లుగా అభివర్ణించారు నిర్మలాసీతారామన్. వీటి ద్వారా వికసిత్ భారత్ను సాధిస్తామన్నారు. ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ కోసం జాతీయ మిషన్ను ప్రారంభించినట్లు ప్రకటించారు నిర్మలాసీతారామన్. ఎడిబుల్ ఆయిల్స్, పప్పులు ద్వారా స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
కాగా.. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్కు కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు ప్రకటించింది. కేంద్ర బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేశారు. బిహార్లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు నిర్మలా సీతారామన్.. దీనిద్వారా.. బీహార్ రైతులకు భారీగా లబ్ది చేకూరనుంది. కొత్తగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. మేకిన్ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళిక చేపట్టామని.. IIT పాట్నాను విస్తరిస్తామని తెలిపారు. బిహార్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుల నిర్మాణం.. ఇందులో భాగంగా పాట్నా ఎయిర్పోర్టు విస్తరణ.. వెస్టర్న్ కోసి ప్రాజెక్టుకు మంజూరు.. బిహార్ మిథిలాంచల్ ప్రాంతంలో కొత్తగా రేవు ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది.. మొత్తం 243 నియోజకవర్గాలకు అక్టోబర్ లేదా నవంబర్ 2025లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి..
ఏపీని ఎందుకు పట్టించుకోలేదన్న కాంగ్రెస్
బీహార్కు వరాల జల్లుపై ప్రతిపక్ష కాంగ్రెస్ స్పందించింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ మాట్లాడుతూ.. ఎన్నికలు జరగనున్నందున కేంద్రం బీహార్కు వరాలు ఇవ్వడం సహజమేనని.. అయితే ఆంధ్రప్రదేశ్ను ఎందుకు దారుణంగా విస్మరించారంటూ ప్రశ్నించారు.
“బీహార్లో ప్రకటనల బొనాంజా వచ్చినట్లు కనిపిస్తోంది. ఏడాది తర్వాత అక్కడ ఎన్నికలు జరగనున్నాయి కనుక ఇది సహజం. అయితే ఎన్డిఎలోని మరో మూలస్థంభమైన ఆంధ్రప్రదేశ్ను ఎందుకు ఇంత దారుణంగా విస్మరించారు?” – అంటూ జైరామ్ రమేష్ పేర్కొన్నారు.
Budget 2025 LIVE: కేంద్ర బడ్జెట్ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..