Jairam Ramesh: అజాద్లా ఉండు.. గులాం లా కాదు.. గులాం నబీ ఆజాద్పై మాజీ కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ విసుర్లు
కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్కు పద్మభూషణ్ ప్రకటించిన తర్వాత దీనిపై స్పందనలు వెల్లువెత్తుతున్నాయి.
Jairam Ramesh Shades Ghulam Nabi Azad: కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad)కు పద్మభూషణ్(Padma Bhushan) ప్రకటించిన తర్వాత దీనిపై స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ(Congress) రెండు వర్గాలుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. ఒకవైపు రాజ్ బబ్బర్, శశి థరూర్ వంటి నేతలు ఆజాద్కు పద్మ అవార్డుపై అభినందనలు తెలుపుతుంటే, మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్(Jairam Ramesh) పరోక్షంగా తన సహోద్యోగిని టార్గెట్ చేశారు. ఆయన పరోక్షంగా స్పందిస్తూ ఆజాద్ను బానిస అని మండిపడ్డారు. పార్టీలో తన సీనియర్ సహోద్యోగి గులాం నబీ ఆజాద్ను ఉద్దేశించి జైరాం రమేష్ ట్వీట్ చేశారు.
నిజానికి కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్తో పాటు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీకి పద్మభూషణ్ ఇస్తామని ప్రకటించారు. అయితే పద్మభూషణ్ను స్వీకరించబోమని భట్టాచార్య ప్రకటించారు. బుద్ధదేవ్ భట్టాచార్జీ ఈ నిర్ణయంపై స్పందిస్తూ, కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ సరైన చర్య తీసుకున్నట్లు ట్విట్టర్లో రాశారు. అతను బానిసగా కాకుండా స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నారని పేర్కొన్నారు.
Right thing to do. He wants to be Azad not Ghulam. https://t.co/iMWF00S9Ib
— Jairam Ramesh (@Jairam_Ramesh) January 25, 2022
జైరామ్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతుందని భావిస్తున్నారు. జైరామ్ రమేష్ చేసిన ఈ ట్వీట్ తర్వాత, ప్రజలు దానిని గులాం నబీ ఆజాద్తో అనుబంధించడం ద్వారా చూడటం ప్రారంభించారు. అయితే, ఈ అవార్డుకు గులాం నబీ ఆజాద్ను అభినందించిన కొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. గులాం నబీ ఆజాద్కు ఈ గౌరవం దక్కడాన్ని కాంగ్రెస్ నేత శశిథరూర్ స్వాగతించారు. అయితే ఈ మొత్తం ఘటనపై గులాం నబీ ఆజాద్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
అదే సమయంలో, మరో కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్, గులాం నబీ ఆజాద్కు ఈ గౌరవం రావడాన్ని స్వాగతించారు. తిరువనంతపురం ఎంపీ థరూర్ ఇలా వ్రాశారు, “గులాం నబీ ఆజాద్కు పద్మభూషణ్ అవార్డు పొందినందుకు అభినందనలు. ఒకరి ప్రజాసేవకు సహకరించినందుకు ఎదుటి పక్షాల ప్రభుత్వం సన్మానం చేయడం విశేషం. అంటూ ట్వీట్ చేశారు.
Warm congratulations to Shri @ghulamnazad on his Padma Bhushan. It is good to be recognized for one’s public service even by a government of the other side. https://t.co/OIT0iVNPjo
— Shashi Tharoor (@ShashiTharoor) January 25, 2022
దీంతో పాటు మరో కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ కూడా ఆజాద్ను అభినందించారు. బబ్బర్ ఇలా వ్రాశాడు, “మీరు అన్నయ్య లాంటివారు మరియు మీ నిష్కళంకమైన ప్రజా జీవితం గాంధేయ ఆదర్శాల పట్ల నిబద్ధత ఎల్లప్పుడూ ప్రేరణగా ఉన్నాయి. 5 దశాబ్దాలుగా దేశానికి మీరు చేసిన సమర్ధవంతమైన సేవకు పద్మభూషణ్ పరిపూర్ణ గుర్తింపు. అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.
Congratulations @ghulamnazad Sahab ! You’re like an elder brother and your impeccable public life & commitment to Gandhian ideals have always been an inspiration. The #PadmaBhushan is an ideal recognition of 5 decades of your meticulous service to the nation.
— Raj Babbar (@RajBabbar23) January 25, 2022
ఇదిలావుంటే, కాంగ్రెస్ (జి-23)లోని 23 మంది అసంతృప్త నేతల బృందానికి నాయకత్వం వహించి, పార్టీలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోనియాగాంధీకి గట్టిగా లేఖ రాయడంతో ఆజాద్ గాంధీ కుటుంబ విధేయులకు గురి కావడం గమనార్హం. అదే సమయంలో, అనేక సందర్భాల్లో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా జమ్మూ కాశ్మీర్కు చెందిన పెద్ద నాయకుడు అజాద్ని ప్రశంసించారు. దీంతో గులాం నబీ ఆజాద్కు వ్యతిరేకత ఎదురవుతుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడుగా కాంగ్రెస్ నేతలే ఆరోపించారు. పార్లమెంట్లో ప్రధాని ఆయనను బహిరంగంగా ప్రశంసించారు. ఇది మాత్రమే కాదు, గత ఏడాది ఫిబ్రవరిలో, గులాం నబీ ఆజాద్ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో, ప్రధాని మోడీ తన వీడ్కోలు ప్రసంగంలో భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో ప్రధాని మోడీ గులాం నబీ ఆజాద్తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. Read Also…. Russia-Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్ బార్డర్లో తీవ్ర ఉద్రిక్తతలు.. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు: పెంటగాన్