Actress Rani Chatterjee: కాంగ్రెస్లో చేరిన ప్రముఖ నటి రాణీ ఛటర్జీ… యూపీ ఎన్నికలే టార్గెట్!
Uttar Pradesh Assembly Election 2022: భోజ్పురి సినీ నటి రాణి ఛటర్జీ కాంగ్రెస్లో చేరారు. ప్రియాంక గాంధీ సమక్షంలో రాణి కాంగ్రెస్(Congress) తీర్థం పుచ్చుకున్నారు.

Actress Rani Chatterjee joins congress: వచ్చే నెలలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh Assembly Election 2022) అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి . ప్రముఖ ముఖాలపై మరోసారి బెట్టింగ్లు ఆడేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు, టికెట్లు దక్కిన రాజకీయ నేతలు పార్టీలు మార్పు కొనసాగుతోంది. తాజాగా భోజ్పురి సినీ నటి రాణి ఛటర్జీ(Rami chetterjee) కాంగ్రెస్లో చేరారు. ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) సమక్షంలో రాణి కాంగ్రెస్(Congress) తీర్థం పుచ్చుకున్నారు. భోజ్పురి(Bhojpuri) సినిమాలో తన నటనను మెప్పించిన రాణి ఛటర్జీ ఇప్పుడు రాజకీయ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతోంది. ప్రియాంక గాంధీ ‘లడకీ హూన్ లడ్ శక్తి హూన్’ ప్రచారంలోనూ రాణి ఛటర్జీ భాగస్వాములయ్యారు. ఇందుకు సంబంధించి ప్రియాంక గాంధీతో రాణీ ఉన్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో కాంగ్రెస్లో చేరుతున్నట్లు సమాచారం.
రాణి ఛటర్జీ మంగళవారం తన ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటోలో, ఆమె ప్రియాంక గాంధీ ముంబై కాంగ్రెస్ యువ నాయకుడు సూరజ్ సింగ్ ఠాకూర్తో కలిసి ఉన్నారు. ఈ చిత్రాన్ని పంచుకుంటూ, రాణి క్యాప్షన్లో రాశారు మరొక అమ్మాయి పోరాడటానికి సిద్ధంగా ఉంది. నేను ప్రియాంక జీ ప్రచారం లడకీ హూన్ లడ్ శక్తి హూన్తో అనుబంధించడం ద్వారా కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. ఈరోజు ఢిల్లీలో ప్రియాంక గాంధీని, నా స్నేహితుడు ముంబై కాంగ్రెస్ యువనేత సూరజ్ సింగ్ ఠాకూర్తో కలిసి కలిశాను. అంటూ రాణీ ఛటర్జీ పేర్కొన్నారు
View this post on Instagram
ప్రస్తుతం రాణి ఛటర్జీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్న విషయంపై క్లారిటీ లేదు. అయితే, రాణి ఛటర్జీని తన ప్రచారానికి వేదికగా చేసుకుని ఓట్లు రాబట్టేందుకు కాంగ్రెస్ సర్వం సిద్ధం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు, యూపీలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ అధికారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోదలుచుకోదు. బిజెపికి ఇప్పటికే భోజ్పురి సినిమాకి చెందిన రవి కిషన్, దినేష్ లాల్ యాదవ్ అలియాస్ నిర్హువా వంటి కళాకారులు ప్రచారం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ కూడా భోజ్పురి నటీనటులను తన శిబిరంలోకి తెచ్చుకుని ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
రాణి ఛటర్జీ పేరు వల్ల కాంగ్రెస్కు ఎంత ప్రయోజనం ఉంటుందో రానున్న ఎన్నికల ఫలితాలను బట్టి తేలిపోతుంది. ప్రస్తుతం, రాణి ఛటర్జీ గురించి మాట్లాడుకుంటే, ముంబైకి చెందిన ఈ నటి 2004 సంవత్సరంలో ససుర బడా పైసావాలా చిత్రంతో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మనోజ్ తివారీతో కలిసి నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా హిట్ కావడంతో ఆతర్వాత రాణి ఇండస్ట్రీలోని పేరున్న నటీనటులతో కలిసి వన్ టు వన్ హిట్ చిత్రాలను అందించారు.
అంతేకాదు, రాణి ఛటర్జీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆమె తన జీవితంలోని క్షణాలను ఫోటోలు, వీడియోల ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. రాణి తన ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ ఫోటోలు మరియు వీడియోలను పంచుకోవడం తరచుగా కనిపిస్తుంది.