Assam Floods: అసోంలో వరద బీభత్సం.. నీటిలో మునిగిన రైల్వే స్టేషన్.. షాకింగ్ వీడియో
Assam Floods 2022: అసోంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి.
Assam Floods News: ఈశాన్య రాష్ట్రం అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శనివారంనాటి నుంచి ఆ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. రెండు వందలకు పైగా గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరదల్లో చిక్కుకుని ఆరుగురు దుర్మరణం చెందగా.. కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో ఐదుగురు మృతి చెందినట్లు అసోం ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. పంటలు నాశనమయ్యాయి. కొండ చరియలు విరిగిపడటం, రైల్వే ట్రాక్లు, వంతెనలు దెబ్బనడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది.
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఆర్మీ, పారా మిలటరీ దళాలు, ఎస్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపడుతున్నాయి. 20 జిల్లాల్లోని 652 గ్రామాల్లో నివసిస్తున్న దాదాపు 2 లక్షల మందిపై భారీ వర్షాలు, వరదలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వరదల కారణంగా 57 వేల మంది నిరాశ్రయులయ్యారు. 55 తాత్కాలిక పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి.. బాధితులను అక్కడకు తరలించారు అధికారులు. మరీ ముఖ్యంగా ఆరు జిల్లాలో వరద నీరు పోటెత్తింది. దిమా హసావో జిల్లాలో మూడు రోజులుగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. అక్కడ 12 గ్రామాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
న్యూ హఫ్లాంగ్ రైల్వే స్టేషన్ పూర్తిగా వరదల్లో మునిగిపోయింది. కొండ చరియలు విరిగిపడి వరదనీరు పోటెత్తడంతో అక్కడ భీతావహ పరిస్థితి నెలకొంది. రైల్వే స్టేషన్లోని రెండు రైళ్లు కూడా వరదనీటిలో మునిగిపోయాయి. హఫ్లాంగ్-దేహంగీ, న్యూ హఫ్లాంగ్-జోరై-మిచిదుయ్ ప్రాంతాల్లో ముగ్గురు చనిపోయారు. 80 ఇళ్లు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. దాంతో వాహనాల రాకపోకలకు అంతరాయడం ఏర్పడింది. భారత వైమానిక దళం, భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. వరదల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అసోంలో వరద బీభత్సం..
Continuous rains wreak havoc in parts of Assam. In the hill district of Dima Hasao, main road links disrupted, stationery train coaches derailed, multiple landslides reported. (Images courtesy NF railways) @IndianExpress pic.twitter.com/OFCIjBdeqN
— Tora Agarwala (@toramatix) May 16, 2022
మైబాంగ్, మహూర్ మధ్య కొండచరియలు విరిగిపడటంతో గంటలపాటు రైల్వే సేవలు నిలిచిపోయాయి. దెబ్బతిన్న ట్రాక్లను సరిచేసేందుకు రైల్వే బృందాలు చర్యలు తీసుకున్నాయి. హఫ్లాంగ్ పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలులకు పట్టణంలోని పలు దుకాణాలు, ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అదేవిధంగా చాలా రహదారులు నీటిలోనే ఉన్నాయి. హరంగాజావో, గుంజంగ్, మైబాంగ్తో సహా పలుచోట్ల చెట్లు నేలకూలాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హాజయ్ జిల్లాలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడిన ఐఏఎఫ్ దళాలు..
#IAF helicopters evacuated 119 passengers from Ditokchera railway station in Assam, today. Located in the Dima Hasao district, the railway station had a train stranded for over 24 hrs due to incessant rains making rail movement infeasible. #IndianAirForce #SavingLives pic.twitter.com/NlgdNhFMEj
— Indian Air Force (@IAF_MCC) May 15, 2022
Continuous rains wreak havoc in parts of Assam. In the hill district of Dima Hasao, main road links disrupted, stationery train coaches derailed, multiple landslides reported. (Images courtesy NF railways) @IndianExpress pic.twitter.com/OFCIjBdeqN
— Tora Agarwala (@toramatix) May 16, 2022
Massive damage! Heavy rain, Flood, Landslides, Road Blocks! Around 1500 Railway Passengers stranded since yesterday!
It’s heartbreaking to see the present condition of New Haflong in Assam’s Dima Hasao district.#AssamFloods pic.twitter.com/1N4moFYdiY
— Debjit Patoa (@DebjitPatoa) May 16, 2022
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..