Ashwini Vaishnaw: ‘మేము కష్టపడి పనిచేసేవాళ్లం’ అని గుర్తుంచుకోండి.. రాహుల్ గాంధీకి అశ్విని వైష్ణవ్ కౌంటర్..

మేము కష్టపడి పనిచేసేవాళ్లం.. అని గుర్తుంచుకోండి.. అంటూ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కౌంటర్ ఇచ్చారు.. కాంగ్రెస్ హయాం తర్వాత భారతీయ రైల్వేలను మెరుగైన స్థితికి తీసుకురావడంలో విజయం సాధించామని.. అశ్విని వైష్ణవ్ రాహుల్ ట్వీట్ కు రిట్వీట్ చేశారు.

Ashwini Vaishnaw: ‘మేము కష్టపడి పనిచేసేవాళ్లం’ అని గుర్తుంచుకోండి.. రాహుల్ గాంధీకి అశ్విని వైష్ణవ్ కౌంటర్..
Ashwini Vaishnaw, Rahul Gandhi
Follow us

|

Updated on: Aug 08, 2024 | 10:05 AM

మేము కష్టపడి పనిచేసేవాళ్లం.. అని గుర్తుంచుకోండి.. అంటూ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కౌంటర్ ఇచ్చారు.. కాంగ్రెస్ హయాం తర్వాత భారతీయ రైల్వేలను మెరుగైన స్థితికి తీసుకురావడంలో విజయం సాధించామని.. అశ్విని వైష్ణవ్ రాహుల్ ట్వీట్ కు రిట్వీట్ చేశారు. అసలేం జరిగిందంటే.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో లోకో పైలట్ల ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. క్యాబిన్‌లో తగిన సౌకర్యాలు.. ప్రాథమిక సౌకర్యాల కోసం వారు తమ డిమాండ్లను పునరుద్ఘాటించారని తెలిపారు.. ప్రతిరోజూ రైలులో ప్రయాణించే కోట్లాది మంది ప్రయాణికుల భద్రతకు ఇది చాలా అవసరం.. ఇది పూర్తిగా న్యాయబద్ధమైన అభ్యర్థన అంటూ రాహుల్ పేర్కొన్నారు.. ఇంకా, లోకో పైలట్‌లతో రైల్వే మంత్రితో సమావేశమయ్యారని.. వారు వారి సమస్యలను విన్నవించారు.. మంత్రి వారి సమస్యలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారని.. దేశప్రజల సురక్షిత ప్రయాణం కోసం ఈ సమస్యలకు పరిష్కారాలను అమలు చేసేలా తాను కూడా చూస్తానంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను పంచుకుంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

రాహుల్ గాంధీ అభ్యర్థనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు.. రాహుల్ గాంధీ పోస్ట్ ను ఉటంకిస్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇలా వ్రాశారు.. ‘‘కాంగ్రెస్ కాలం నుంచి భారతీయ రైల్వేలను మెరుగైన స్థితికి తీసుకురావడంలో ఈ రోజు మేము విజయం సాధించాము. 2014 నుండి “లోకో పైలట్‌ల” సౌకర్యాలు నిరంతరం మెరుగుపరుస్తూనే ఉన్నాం.. భవిష్యత్తులో కూడా వారికి మరిన్ని సౌకర్యాలను అందించడానికి సిద్ధంగా ఉన్నాం.. గుర్తుంచుకోండి, మేము కష్టపడి పనిచేసే వ్యక్తులం..’’ అంటూ ఓ ఫొటోను మంత్రి జత చేశారు.

అశ్విని వైష్ణవ్ ట్వీట్..

2004-14 వరకు లోకో పైలట్‌లకు ఏసీతో కూడిన విశ్రాంతి గదులు జీరోగా ఉన్నాయని, ఇప్పుడు 558కి పెరిగిందన్నారు. ఇంతకు ముందు ఏసీ క్యాబిన్‌తో కూడిన ఇంజన్‌లు, వాష్‌రూమ్‌తో కూడిన లోకో క్యాబ్‌ల సంఖ్య జీరోగా ఉండేదని, 2014 – 2024 వరకు వాటి సంఖ్య వరుసగా 7075, 815కు పెరిగిందని.. అశ్విని వైష్ణవ్ వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కష్టపడి పనిచేసేవాళ్లం.. రాహుల్ గాంధీకి అశ్విని వైష్ణవ్ కౌంటర్..
కష్టపడి పనిచేసేవాళ్లం.. రాహుల్ గాంధీకి అశ్విని వైష్ణవ్ కౌంటర్..
ఈనగరం స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యపాత్ర ఎన్నోపోరాటాల చరిత్ర ఆనవాళ్ల
ఈనగరం స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యపాత్ర ఎన్నోపోరాటాల చరిత్ర ఆనవాళ్ల
సముద్రంలో అనుమానంగా కనిపించిన రెండు బోట్లు.. మామూలు స్కెచ్ కాదుగా
సముద్రంలో అనుమానంగా కనిపించిన రెండు బోట్లు.. మామూలు స్కెచ్ కాదుగా
మీ కలలో ఈ జంతువులు కనిపిస్తే రాజయోగానికి చిహ్నమట..
మీ కలలో ఈ జంతువులు కనిపిస్తే రాజయోగానికి చిహ్నమట..
చూడటానికి ఇలా ఉన్నాడే కానీ.. ఈయన మామూలోడు కాదు..!
చూడటానికి ఇలా ఉన్నాడే కానీ.. ఈయన మామూలోడు కాదు..!
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. గదిలోకెళ్లిన అరగంటకే ఊహించని సీన్
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. గదిలోకెళ్లిన అరగంటకే ఊహించని సీన్
ద్యావుడా..! నిశ్చితార్థ వేడుకలో విందు కోసం ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్
ద్యావుడా..! నిశ్చితార్థ వేడుకలో విందు కోసం ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్
భారీగా కానిస్టేబుల్ కొలువులకు నోటిఫికేషన్‌.. ఆగస్టు 27న ప్రకటన
భారీగా కానిస్టేబుల్ కొలువులకు నోటిఫికేషన్‌.. ఆగస్టు 27న ప్రకటన
వినేశ్ ఫొగాట్‌పై హేమ మాలిని అనుచిత వ్యాఖ్యలు.. వీడియో వైరల్
వినేశ్ ఫొగాట్‌పై హేమ మాలిని అనుచిత వ్యాఖ్యలు.. వీడియో వైరల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ వర్సెస్‌ జియో, ఎయిర్‌టెల్‌, వీఐ.. ఏది బెస్ట్‌ అంటే
బీఎస్‌ఎన్‌ఎల్‌ వర్సెస్‌ జియో, ఎయిర్‌టెల్‌, వీఐ.. ఏది బెస్ట్‌ అంటే