Hate Speech: అసదుద్దీన్ ఒవైసీతోపాటు మరో 10 మందిపై ఢిల్లీలో కేసు.. పార్లమెంట్ స్ట్రీట్లో ఎంఐఎం మహిళా కార్యకర్తల నిరసన..
Muhammad Row Hate Speech: ఢిల్లీలో పాటు ఉత్తరప్రదేశ్లో కూడా కేసులు నమోదయ్యాయి. స్వామి యతి నరసింహానంద్పై కూడా ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. మొత్తం 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది స్పెషల్ సెల్.
Muhammad Row: మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై(Asaduddin Owaisi) ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఒవైసీపై ఢిల్లీ స్పెషల్ సెల్ కేసు నమోదు చేసింది. ఢిల్లీలో పాటు ఉత్తరప్రదేశ్లో కూడా కేసులు నమోదయ్యాయి. స్వామి యతి నరసింహానంద్పై కూడా ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. మొత్తం 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది స్పెషల్ సెల్. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నూపుర్శర్మపై కూడా ఢిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. వాతావరణాన్ని చెడగొట్టే విషయంలో నమోదైన రెండు ఎఫ్ఐఆర్లకు సంబంధించి ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లకు నోటీసులు కూడా జారీ చేశారు. వారి నుంచి సమాచారం కోరారు. దీనితో పాటు, వాతావరణాన్ని దెబ్బ తీస్తున్న ఇలాంటి పోస్ట్లను నివారించాలని ఢిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఏఐఎంఐఎం మహిళా కార్యకర్తల నిరసన
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద ప్రకటనకు నిరసనగా AIMIM ఈరోజు దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రకటించింది. AIMIMకి చెందిన కొందరు మహిళా కార్యకర్తలు కూడా సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అనుమతించని నూపుర్ శర్మ ప్రకటనకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద AIMIM నిరసన ప్రదర్శన నిర్వహించింది.
AIMIM chief Asaduddin Owaisi named in FIR registered by the IFSO unit of Delhi Police over alleged inflammatory remarks yesterday. Swami Yati Narasimhananda’s name also mentioned in the FIR. pic.twitter.com/8NpEKdQvI8
— ANI (@ANI) June 9, 2022
ఒవైసీపై కేసు నమోదైన వెంటనే కొన్ని క్షణాల్లో చాలా మంది AIMIM కార్యకర్తలు ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వెలుపల ధర్నాకు దిగారు. పెద్ద ఎత్తున నినాదాలు చేయడం మొదలు పెట్టారు. అకస్మత్తుగా జరిగిన ఈ ఘటనతో పోలీసులు షాక్ అయ్యారు. పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలుపుతున్న మహిళలను అదుపులోకి తీసుకున్నారు. విరి నిరసన ముగిసిందని అనుకున్న కొన్ని క్షణాల్లో మరికొందరు మహిళా కార్యకర్తలు అక్కడ నిరసనకు దిగడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు.
విద్వేషపూరిత సందేశాలను వ్యాప్తి చేయడం, వివిధ సమూహాలను రెచ్చగొట్టడం మరియు శాంతికి దారితీసే పరిస్థితిని సృష్టించడం మరియు వ్యవస్థను దెబ్బతీసే పరిస్థితిని సృష్టించడం వంటి ఆరోపణలపై కొంతమంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు బుధవారం తెలిపారు. స్పెషల్ సెల్లోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్ (IFSO) యూనిట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వ్యక్తులపై ఎఫ్ఐఆర్ మొదటి ఎఫ్ఐఆర్లో నూపుర్ శర్మ పేరు కూడా ఉంది. ఇటీవల ఒక టీవీ చర్చా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న నుపుర్ను పార్టీ సస్పెండ్ చేసింది. రెండో ఎఫ్ఐఆర్లో నవీన్ కుమార్ జిందాల్, షాదాబ్ చౌహాన్, సబా నఖ్వీ, మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహ్మాన్, గుల్జార్ అన్సారీ పేర్లు ఉన్నాయి. వివిధ మతాలకు చెందిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఐఎఫ్ఎస్సీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేపీఎస్ మల్హోత్రా తెలిపారు.