AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aiims Delhi: శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు ఒకపూట సెలవు ప్రకటించడంపై వెనక్కి తగ్గిన ఢిల్లీ ఎయిమ్స్..!

రామమందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సోమవారం ఒకపూట సెలవు ఇచ్చిన అంశంపై ఢిల్లీలోని ఎయిమ్స్‌ యూటర్న్‌ తీసుకుంది. ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ అపాయింట్‌మెంట్‌లకు అనుగుణంగా ఓపీ విభాగం తెరిచే ఉంచుతామని ప్రకటించింది. రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెల్పింది. ఈ మేరకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఒకపూట సెలవులోఅన్ని కీలక విభాగాల సేవలు..

Aiims Delhi: శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు ఒకపూట సెలవు ప్రకటించడంపై వెనక్కి తగ్గిన ఢిల్లీ ఎయిమ్స్..!
Aiims Delhi
Srilakshmi C
|

Updated on: Jan 21, 2024 | 3:38 PM

Share

ఢిల్లీ, జనవరి 21: రామమందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సోమవారం ఒకపూట సెలవు ఇచ్చిన అంశంపై ఢిల్లీలోని ఎయిమ్స్‌ యూటర్న్‌ తీసుకుంది. ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ అపాయింట్‌మెంట్‌లకు అనుగుణంగా ఓపీ విభాగం తెరిచే ఉంచుతామని ప్రకటించింది. రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెల్పింది. ఈ మేరకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఒకపూట సెలవులోఅన్ని కీలక విభాగాల సేవలు కూడా యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేసింది. కాగా

అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రామభక్తులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలతోపాటు, అనేక విద్యా సంస్థలు, వివిధ కార్యాలయాలు ఆ రోజున సెలవు ప్రకటించాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఎయిమ్స్‌ కూడా మధ్యాహ్నం 2.30 వరకు ఒకపూట సెలవు ఇస్తున్నామని, అప్పటి వరకూ ఆస్పత్రి మూసివేస్తున్నట్లు శనివారం తన ఉత్తర్వుల్లో ప్రకటించింది. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎయిమ్స్ నిర్ణయంతో ఆరోగ్య సేవలకు ఆటంకం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ శివసేన, తృణమూల్‌ కాంగ్రెస్‌ సహా పలువురు సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు.

శివసేన (యుబిటి) ఎంపీ ప్రియాంక చతుర్వేదితోపాటు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సంద‌ర్భంగా జనవరి 22న మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ త‌లెత్తేలా చేయ‌కండి. తనకు స్వాగ‌తం ప‌లికేందుకు ఆరోగ్య సేవ‌ల‌కు అంతరాయం కలిగించడాన్ని రాముడు అంగీక‌రిస్తాడాని నాకు ఆశ్చర్యం క‌లుగుతోంద‌ని ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ప్రజలు అపాయింట్‌మెంట్ కోసం ఎయిమ్స్ గేట్ల వద్ద చలిలో ఆరు బయట పడిగాపులు కాస్తుంటారు. మోదీ ప్రభుత్వం కెమెరాలు, పీఆర్‌లకు ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పేద ప్రజలు వైద్యం కోసం నిరీక్షిస్తూ చనిపోతారంటూ ఎక్స్‌లో విమర్శించారు. ఈ నేపథ్యంలోనే తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకున్న ఎయిమ్స్‌, సోమవారం అన్ని సేవలను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ప్రకటన వెలువరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఊరట.. ప్రభుత్వం కొత్త నిర్ణయం
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఊరట.. ప్రభుత్వం కొత్త నిర్ణయం
ప్రపంచ భవిషత్తుకు పర్వత శిఖరం.. అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి..
ప్రపంచ భవిషత్తుకు పర్వత శిఖరం.. అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి..