AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గంజాయి ఎక్కడ దొరుకుతుందో పోలీసులకు చెప్పిన కాలేజీ స్టూడెంట్..

దేశవ్యాప్తంగా డ్రగ్స్ నివారణ కోసం అనేక రాష్ట్రాల పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా హర్యానా పోలీసులు మత్తు పదార్థాలు నిషేధానుసారం కాలేజ్ విద్యార్థులతో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ కార్యక్రమం కొనసాగుతున్న మధ్యలోనే ఒక విద్యార్థి వేసిన ప్రశ్నకు పోలీసులు కంగుతున్నారు.

Viral Video: గంజాయి ఎక్కడ దొరుకుతుందో పోలీసులకు చెప్పిన కాలేజీ స్టూడెంట్..
Drug Control Program
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Mar 09, 2024 | 5:52 PM

Share

దేశవ్యాప్తంగా డ్రగ్స్ నివారణ కోసం అనేక రాష్ట్రాల పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా హర్యానా పోలీసులు మత్తు పదార్థాలు నిషేధానుసారం కాలేజ్ విద్యార్థులతో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ కార్యక్రమం కొనసాగుతున్న మధ్యలోనే ఒక విద్యార్థి వేసిన ప్రశ్నకు పోలీసులు కంగుతున్నారు. హర్యానాలోని సోనిపారట్‎లోని ఒక యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థి వేసిన ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‎గా మారిపోయింది. గాంజాయిపై ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నారు బానే ఉంది. కానీ ప్రతి యూనివర్సిటీనే మత్తు పదార్థాలకు నిలయంగా మారిపోయిందని ఎందుకు గుర్తించలేకపోతున్నారని ఆ విద్యార్థి పోలీసులను ప్రశ్నించాడు. గంజాయిని అమ్ముతున్న వ్యక్తులను.. వాటి కోసం వెంట పడుతున్న యువకులను పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారని విద్యార్థి ప్రశ్నించాడు. ఒక చిన్న చాక్లెట్ లేదా లాలీపాప్ దొరికినంత ఈజీగా యూనివర్సిటీల బయట తమకు గంజాయి దొరుకుతుందని విద్యార్థి ఆరోపించాడు.

తమ కాలేజీకి దగ్గరలోనే ఒక పోలీస్ స్టేషన్ ఉందని, ఆ పోలీస్ స్టేషన్‎కి ఎదురుగానే గంజాయి దొరుకుతుందని చెప్పి పోలీసులకే కంగు తినిపించాడు. ఇది పోలీసుల ఫెయిల్యూర్ కాదా అంటూ యువకుడు నిలదీశారు. అయితే మత్తు పదార్థాల నిషేధానుసారం ఎక్కువ సంఖ్యలో కాలేజ్ స్టూడెంట్స్ ప్రభావితం అవుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పోలీసులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న అనేక నేరాల్లో నిందితులు మత్తులో ఉన్న కారణంగా జరుగుతున్నట్టు గుర్తించి పూర్తిగా డ్రగ్ ఫ్రీ సిటీస్ కోసం అన్ని మెట్రోపాలిటన్ సిటీల్లో ఆయా రాష్ట్ర పోలీసుల చేత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణలో సైతం మత్తుపదార్థాల నిషేధానుసారం ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మత్తు పదార్థాల నివారణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త వింగ్ ను సైతం ఏర్పాటు చేసింది. అడిషనల్ డీజీ స్థాయి అధికారి ఈ వింగ్‎ను పర్యవేక్షిస్తారు. ఇటీవల రాష్ట్రంలో వరుసగా డ్రగ్స్ కేసులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు డ్రగ్ ముఠాలతో ఉన్న లింకులు బయటపడుతున్నాయి. డ్రగ్స్ అమ్మిన, సేవించిన కచ్చితంగా శిక్షను అనుభవిస్తారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us