AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucknow: సాధ్విపై దారుణం.. మత్తు మందు ఇచ్చి పైశాచికం.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు..

లఖ్ నవూ.. నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. నిన్నటికి నిన్న ట్యూషన్ కు వెళ్లి తిరిగి వస్తున్న బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనను మరవకముందే.. మరోసారి అలాంటి ఇన్సిడింటే జరిగింది. అయితే ఈ సారి 55 ఏళ్ల..

Lucknow: సాధ్విపై దారుణం.. మత్తు మందు ఇచ్చి పైశాచికం.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు..
Harassment
Ganesh Mudavath
|

Updated on: Oct 18, 2022 | 10:04 AM

Share

లఖ్ నవూ.. నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. నిన్నటికి నిన్న ట్యూషన్ కు వెళ్లి తిరిగి వస్తున్న బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనను మరవకముందే.. మరోసారి అలాంటి ఇన్సిడింటే జరిగింది. అయితే ఈ సారి 55 ఏళ్ల సాధ్విపై సామూహిక అత్యాచారం చేయడం కలకలం రేపింది. గోమతీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఓ ఆశ్రమంలో నివాసముంటున్న ఓ మహిళపై నలుగురు వ్యక్తులు మత్తు మందు ఇచ్చి ఈ దారుణానికి పాలప్డారు. అంతే కాకుండా ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే ఆశ్రమం నుంచి వెళ్లగొడతామని బెదిరించినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని కర్చన ప్రాంతానికి చెందిన మహిళ.. లఖ్ నవూలోని ఓ ఆశ్రమంలో ఉంటోంది. అంతకు ముందు ఆమె మథురలోని ఓ ఆశ్రమంలో నివసించేది. ఆ సమయంలో ప్రయాగ్‌రాజ్‌లో మాగ్ జాతర జరిగింది. దీంతో ఆమె అక్కడికి వచ్చింది. అక్కడ ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయంతో ఆమె లఖ్ నవూలోని సాధిక బృందావనంలోని రుక్మణి బహార్ ఆశ్రమానికి చేరుకుంది. కొన్నాళ్లు బాగానే ఉన్న ఆమెపై క్రమంగా వేధింపులు మొదలయ్యాయి. ఆశ్రమ మహంత్.. తనపై అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగికంగానూ వేధించినట్లు ఆమె పోలీసులకు తెలిపింది.

అక్టోబర్ 4 న ఎవరూ లేని సమయంలో నలుగురు వ్యక్తులు.. మహిళ తీసుకునే ఆహారంలో మత్తుపదార్థాలు కలిపారు. దీంతో ఆమె స్పృహ తప్పి అపస్మారక స్థితికి చేరుకుంది. అనంతరం నలుగురు ఒకరి తర్వాత మరొకరు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహ వచ్చాక చూసుకుంటే.. నిర్మానుష్య ప్రదేశంలో, దుర్భర స్థితిలో ఉన్నట్లు ఆమె గుర్తించింది. అక్కడే ఉన్న ఆ నలుగురు వ్యక్తులు ఆమెను బెదిరించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై బాధితురాలు ఆశ్రమ మహంత్ కు ఫిర్యాదు చేసింది. అయితే అతను కూడా నిందితుల వైపే నిలవడంతో బాధితురాలు షాక్ అయింది. ఇక్కడే ఉండాలనుకుంటే ఇదంతా సహించాల్సిందేనని తనతో చెప్పినట్లు ఆమె వాపోయింది.

పైనల్ గా వారి బారి నుంచి బయటపడిన బాధితురాలు.. జరిగిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న గోమతినగర్ ఇన్‌స్పెక్టర్ దినేష్ చంద్ర మిశ్రా.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నిందితులు ఆశ్రమం నుంచి పరారీలో ఉన్నారని వారి కోసం వెతుకుతున్నామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు