AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిర్‌ పోర్ట్‌ రన్‌వేపై కూర్చోని పరీక్ష రాసిన 300 విద్యార్థులు! ఎందుకంటే..?

బీహార్‌లోని సహర్సా విమానాశ్రయ రన్‌వేపై 300 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్న విచిత్ర దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక ప్రైవేట్ అకాడమీ పోలీస్, బీఎస్‌ఎఫ్, ఆర్మీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తూ, పెద్ద హాలు లేక రన్‌వేని ఉపయోగిస్తోంది. అకాడమీ నిర్వాహకులు ప్రభుత్వం నుండి సరైన వసతులు లేకపోవడమే దీనికి కారణమని వివరించారు.

ఎయిర్‌ పోర్ట్‌ రన్‌వేపై కూర్చోని పరీక్ష రాసిన 300 విద్యార్థులు! ఎందుకంటే..?
Exam On Runway
SN Pasha
|

Updated on: May 02, 2025 | 5:17 PM

Share

రన్‌వేపై విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ అవుతుంటాయనే విషయం అందరికీ తెలుసు. కానీ, మీరు ఎప్పుడైనా విమానాశ్రయ రన్‌వేపై విద్యార్థులు పరీక్షలు రాయడం చూశారా. ఇది బీహార్‌లోని సహర్సా జిల్లాలో ఈ వింత సంఘటన జరిగింది. విమానాశ్రయ రన్‌వేపై దాదాపు 300 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. రన్‌వేపై విద్యార్థులు పరీక్షలు రాస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

నిజానికి సహర్సా విమానాశ్రయ ప్రాంగణంలో ఒక ప్రైవేట్ అకాడమీ బీహార్ పోలీస్, బీఎస్ఎఫ్, ఆర్మీలో చేరాలనుకునే విద్యార్థులకు శారీరక శిక్షణ ఇస్తోంది. ఈ శిక్షణ కోసం ఎంపిక చేసేందుకు విద్యార్థులకు ఒక పరీక్ష పెట్టారు. పరీక్ష నిర్వహించడానికి పెద్ద హాలు అవసరం కావడంతో విమానాశ్రయ రన్‌వేను పరీక్షా హాలుగా మార్చారు. ప్రతి వారం 300 మందికి పైగా అభ్యర్థులకు ఇక్కడ పరీక్ష పరీక్షలు రాస్తుంటారని సమాచారం. కొన్ని సార్లు పరీక్షను వేరే చోట నిర్వహిస్తామని అకాడమీ నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రతి ఆదివారం రన్‌వేపై విద్యార్థులకు రాత పరీక్ష జరుగుతుందని తెలుస్తోంది. ఈ విషయంపై అకాడమీ డైరెక్టర్ కరణ్ టైగర్ స్పందిస్తూ.. 2015 నుండి యువతకు శారీరక శిక్షణ ఇస్తున్నాం. ఇప్పుడు విద్యార్థులను రాత పరీక్షకు కూడా సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వం ఈ స్థలంలో ఏదైనా నిర్మాణ పనులు ప్రారంభించే వరకు లేదా ఏవైనా మార్గదర్శకాలు జారీ చేసే వరకు ఇలా రన్‌వేపైనే పరీక్షలు పెట్టక తప్పడం లేదని ఆయన అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి