Students: కరోనా హాట్స్పాట్గా వైద్య కళాశాల.. 281 మంది విద్యార్థులకు పాజిటివ్..
Students tested positive for Covid-19: కరోనా వైరస్ ఉధృతి ఇంకా పెరుగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఇప్పడిప్పుడే పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో
Students tested positive for Covid-19: కరోనా వైరస్ ఉధృతి ఇంకా పెరుగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఇప్పడిప్పుడే పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో మహమ్మారి విద్యార్థులను వెంటాడుతోంది. కర్ణాటకలోని ధార్వాడ ఎస్డీఎం మెడికల్ కళాశాల కరోనాతో బెంబేలెత్తుతోంది. కరోనా హాట్స్పాట్గా మారిన ఈ కళాశాలలో కొత్తగా మరో 77 మందికి వైరస్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు కళాశాలలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య మొత్తం 281కి చేరింది. కేసులు పెరుగుతుండటంతో కళాశాలలో కొత్త అడ్మిషన్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. కళాశాల మొత్తాన్ని మూసివేసి పరీక్షలను నిర్వహిస్తున్నారు. కంటైన్మెంట్ జోన్గా ప్రకటించి కోవిడ్ నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే డిశ్చార్జ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా.. కరోనా సోకిన వారిలో అత్యధికమంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారే ఉన్నట్టు అధికారులు తెలిపారు. కాగా.. ఈ కళాశాల క్యాంపస్లో ఇటీవల ఫ్రెషర్స్డే పార్టీ వేడుకలు ఘనంగా జరిగాయి. రెండు మూడు రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగడంతో ఈ వైరస్ ప్రబలడానికి కారణం ప్రెషర్ పార్టీయేనని అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. పాజిటివ్గా నిర్ధారణ అయిన వారిలో 113 శాంపిల్స్ని బెంగళూరులోని ల్యాబ్కు తరలించామని.. వీటి ఫలితం త్వరలో వచ్చే అవకాశం ఉన్నట్టు ఆరోగ్యశాఖ కమిషనర్ డి.రణ్దీప్ వెల్లడించారు.
కాగా.. ఎస్డీఎం కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చదువుతున్న విద్యార్థులు కొంతమంది ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో కొవిడ్ పరీక్షలు చేయించారు. వారిలో కొందరు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Also Read: