Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అకాల వర్షంతో విధ్వంసం.. పిడుగులు పడి 12 మంది మృతి.. ఆయా జిల్లాల్లో అధికారుల పర్యటన

రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఈదురు గాలులు, వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. శుక్రవారం 79 మిమీ వర్షం కురిసింది. బొకారోలో 52.4 మిమీ, రాంచీలో 5.9 మిమీ వర్షం కురిసింది. గత రెండు రోజుల్లో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి మొత్తం 12 మంది మృత్యువాతపడ్డారు.

అకాల వర్షంతో విధ్వంసం.. పిడుగులు పడి 12 మంది మృతి.. ఆయా జిల్లాల్లో అధికారుల పర్యటన
Lightning Strike
Follow us
Jyothi Gadda

|

Updated on: May 27, 2023 | 9:38 PM

ఝార్ఖండ్‌లో పిడుగులు విధ్వంసం కొనసాగింది. గత రెండు రోజుల్లో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి మొత్తం 12 మంది మృత్యువాతపడ్డారు. ధన్‌బాద్, జెంషెడ్‌పూర్, గుమ్లా, చత్రా, హజారీ బాగ్, రాంచీ , బొకారో తదితర ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయని అధికారులు వెల్లడించారు. మే 26న ధన్‌బాద్ జిల్లా బర్వద్దా ఏరియాలో తల్లీకూతుళ్లు పిడుగుపాటుకు గురయ్యారు. జెంషెడ్‌పూర్ లోని భ్రగోరా, గుమ్లా జిల్లా చిరోఢి వద్ద ఇద్దరు ,లోహర్‌డగ్గా వద్ద ఒకరు చనిపోయారు. గురువారం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. చత్రా, హజారీబాగ్, రాంచీ, బొకారో, ఖుంతి జిల్లాల్లో ఒక్కొక్కరు వంతున , పాలము జిల్లాలో హుస్సేనాబాద్ లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ఆయా జిల్లాల అధికారులు ఈ మరణాల వివరాలను పరిశీలించి తెలియజేస్తే ఆయా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించడమౌతుందని ఎస్‌డిఆర్‌ఎస్ విభాగం తెలియజేసింది. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల వంతున రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గత రెండు రోజుల్లో రాష్ట్రంలో ఈదురుగాలులు, మెరుపులు, పిడుగులతో వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలాయి.

రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఈదురు గాలులు, వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. జెంషెడ్‌పూర్‌లో శుక్రవారం 79 మిమీ వర్షం కురిసింది. బొకారోలో 52.4 మిమీ, రాంచీలో 5.9 మిమీ వర్షం కురిసింది. ఉత్తర బీహార్, ఉత్తర ఒడిశా నుంచి హర్యానా నుంచి సిక్కిం వరకు అల్పపీడన ద్రోణి కారణంగా ఝార్ఖండ్‌లో పిడుగల వాన కురిసిందని రాంచీ వాతావరణ విభాగం ఇన్ ఛార్జి అభిషేక్ ఆనంద్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

అబద్ధం చెప్పేవారికి యముడు ఏ శిక్ష వేస్తాడో తెలుసా..?
అబద్ధం చెప్పేవారికి యముడు ఏ శిక్ష వేస్తాడో తెలుసా..?
మీ కలలలో వీటిని చూసినట్లయితే అమ్మవారు మీ పట్ల దయతో ఉందని అర్థమట
మీ కలలలో వీటిని చూసినట్లయితే అమ్మవారు మీ పట్ల దయతో ఉందని అర్థమట
నా కొడుకును బలి పశువును చేస్తున్నారు.. పృథ్వీరాజ్ సుకుమార్ తల్లి.
నా కొడుకును బలి పశువును చేస్తున్నారు.. పృథ్వీరాజ్ సుకుమార్ తల్లి.
యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిజక్ట్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిజక్ట్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే!
పెళ్లివేడుకలో కూతురు ఆద్య, భార్య ఐష్‌తో కలిసి సందడి చేసిన అభిషేక్
పెళ్లివేడుకలో కూతురు ఆద్య, భార్య ఐష్‌తో కలిసి సందడి చేసిన అభిషేక్
Tv9 సమ్మిట్‌..అబుదాబిలో మోదీ ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
Tv9 సమ్మిట్‌..అబుదాబిలో మోదీ ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
వీరిని అస్సలు నమ్మకూడదు.. విదుర నీతి ఏం చెబుతుందో తెలుసా..?
వీరిని అస్సలు నమ్మకూడదు.. విదుర నీతి ఏం చెబుతుందో తెలుసా..?
ఏంటీ కీర్తి ఇలా మారిపోయింది.. బ్లాక్ చీరలో కీర్తిసురేష్ ఫొటోస్!
ఏంటీ కీర్తి ఇలా మారిపోయింది.. బ్లాక్ చీరలో కీర్తిసురేష్ ఫొటోస్!