AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour: ఏపీ నుంచి వారణాసి అయోధ్య ప్రయాగ్‌రాజ్ టూర్ ప్యాకేజీ.. 8 రాత్రులు, 9 పగళ్లు.. టికెట్ కూడా తక్కువే..

IRCTC tourism Puri Kashi Ayodhya Package: ఇండియన్ రైల్వేస్, టూరిజం కార్పొరేషన్ ద్వారా చౌకైన టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టారు. దీని కింద మీరు 8 రాత్రులు, 9 పగళ్లు దేశంలోని వివిధ ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఆ వివరాలను మీరు ఇక్కడ చూడవచ్చు..

IRCTC Tour: ఏపీ నుంచి వారణాసి అయోధ్య ప్రయాగ్‌రాజ్ టూర్ ప్యాకేజీ.. 8 రాత్రులు, 9 పగళ్లు.. టికెట్ కూడా తక్కువే..
Irctc Tourism
Sanjay Kasula
|

Updated on: Jul 21, 2023 | 5:53 PM

Share

Indian Railways Tour Package: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ) దేశంలోని వివిధ ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలను అందిస్తుంది. ఇటీవల ఇది పూరీ కాశీ,  అయోధ్యలను కలుపుతూ పుణ్య క్షేత్ర టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఈ పర్యటన భారత్ గౌరవ్ టూరిజం రైలులో సాగుతుంది. ఇది 8 రాత్రులు, 9 పగళ్లపాటు ఈ ప్రయాణం ఉంటుంది. ఈ ప్రయాణంలో ప్రయాగ్‌రాజ్, అయోధ్య, వారణాసి, గయాతోపాటు పూరీని కూడా సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ జూలై 26 నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఆగస్టు 3 వరకు కొనసాగుతుంది. ప్రయాణీకులు విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి రైలు ఎక్కవచ్చు.. దిగవచ్చు.. ప్రయాగ్‌రాజ్‌లో ఈ రైలులో త్రివేణి సంగమం, హనుమాన్ ఆలయం, శంకర్ విమాన మండపం ఉన్నాయి.

అయితే పర్యాటకులు అయోధ్యలోని రామజన్మభూమి, హనుమాన్ గర్హి ఆలయాలను సందర్శించవచ్చు. వారణాసిలోని పర్యాటక ఆకర్షణలలో కాశీ విశ్వనాథ ఆలయం, విశాలాక్షి ఆలయం, అన్నపూర్ణా దేవి ఆలయం, గంగా ఆరతి ఉన్నాయి, గయలో వారు పిండ్ ప్రధానం, విష్ణు పాదం ఆలయం, పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయం, కోణార్క్‌లోని సూర్య దేవాలయం వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

అద్దె ఎంత ఉంటుందంటే..

డబుల్/ట్రిపుల్ షేరింగ్ కోసం ఒక్కొక్కరికి రూ. 15,075 (స్లీపర్ క్లాస్), రూ. 23,675 (3-ఏసీ), రూ. 31,260 (2-ఏసీ)తో బుకింగ్‌లు చేయవచ్చు. స్లీపర్ క్లాస్‌కు రూ.14,070, థర్డ్ ఏసీకి రూ.22695, పిల్లలకు (5 నుంచి 11 ఏళ్లలోపు) అదే ఛార్జీ రూ.29,845. రాత్రి బస కోసం హోటల్, అల్పాహారం, భోజనం, ప్రయాణ బీమా, స్థానిక రవాణాతో సహా అన్నీ ఈ టూర్ ప్యాకేజీ కింద కవర్ చేయబడతాయి. దీని కోసం మీ నుండి ఎటువంటి అదనపు ఛార్జీ తీసుకోబడదు.

మీరు ఎక్కడ బుక్ చేసుకోవచ్చు

విశాఖపట్నం రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ వద్ద ఉన్న ఐఆర్‌సీటీసీ కార్యాలయంలో బుకింగ్ చేయవచ్చు. ఇది కాకుండా, మీరు ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా కూడా టూర్ ప్యాకేజీలను బుక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు అధికారిక వెబ్‌సైట్‌ లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత టూరిజం విభాగానికి వెళ్లి ఈ టూర్ ప్యాకేజీని ఎంచుకుని బుక్ చేసుకోవచ్చు.

ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో..

ఆహారం, అల్పాహారం, బస, రవాణా, రవాణా మినహా మిగిలిన ఏదీ రైల్వే అందించదు. మీరు మార్కెట్‌లో ఏదైనా అదనపు వస్తువును కొనుగోలు చేస్తే దాని ఖర్చులు మీరే చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, మీరు హోటల్ నుంచి ఏదైనా ఇతర అదనపు సౌకర్యాన్ని తీసుకుంటే.. దానికి ఛార్జీ విధించవచ్చు. అదే సమయంలో, మీరు మెనూ కాకుండా అదనపు ఆహారాన్ని ఆర్డర్ చేస్తే.. అది ఐఆర్సీటీసీ ద్వారా ఇవ్వబడదు.

మరిన్ని టూరిజం వార్తల కోసం