AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: ఎలాంటి మందులు వాడకుండానే మధుమేహాన్ని తరిమికొట్టిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్.. ఎలాగంటే..

భారతీయ సంతతికి చెందిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్‌ఓ) రవిచంద్ర ఎలాంటి మందులు తీసుకోకుండానే తన మధుమేహాన్ని ఎలా అదుపులోకి తెచ్చుకున్నాడో ఇటీవల వెల్లడించారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) ప్రకారం.. అమోలి ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ CFO రవిచంద్ర 51 సంవత్సరాల వయస్సులో టైప్ 2 డయాబెటిస్‌తో నయమయ్యారు. ఎలాంటి మందులు వాడకుండా కేవలం మూడు నెలల్లోనే..

Diabetes: ఎలాంటి మందులు వాడకుండానే మధుమేహాన్ని తరిమికొట్టిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్.. ఎలాగంటే..
Indian Origin Cfo
Subhash Goud
|

Updated on: Apr 04, 2024 | 5:37 PM

Share

మధుమేహం.. దీని గురించి తెలియని వారుండరు. ఎందుకంటే ఈ రోజుల్లో డయాబెటిస్‌ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సైతం ఎన్నో సార్లు వెల్లడించింది. మధుమేహం రావడానికి గల కారణాలు కుటుంబ చరిత్ర, జీవనశైలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవన శైలిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బిజీ లైఫ్‌, నిద్రలేమి, సమయానికి భోజనం చేయకపోవడం, టెన్షన్‌, ఒత్తిడి తదితర కారణాల వల్ల మధుమేహుల సంఖ్య పెరిగిపోతోంది. అయితే మధుమేహానికి శాశ్వత పరిష్కారం అంటూ ఉండదనే విషయం అందిరికి తెలిసిందే. జీవితాంతం మందులు వాడుతూనే ఉంటాయి. కానీ ఎలాంటి మందులు వాడకుండానే మధుమేహాన్ని తరిమికొట్టవచ్చని నిరూపించారు భారతీయ సంతతికి చెందిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్‌ఓ) రవిచంద్ర. ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల దానిని పూర్తిగా నయం చేసుకోవచ్చంటున్నారు.

రవిచంద్ర ఎలాంటి మందులు తీసుకోకుండానే తన మధుమేహాన్ని ఎలా అదుపులోకి తెచ్చుకున్నాడో ఇటీవల వెల్లడించారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) ప్రకారం.. అమోలి ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ CFO రవిచంద్ర 51 సంవత్సరాల వయస్సులో టైప్ 2 డయాబెటిస్‌తో నయమయ్యారు. ఎలాంటి మందులు వాడకుండా కేవలం మూడు నెలల్లోనే రక్తంలో గ్లూకోజ్ స్థాయి సాధారణ స్థితికి చేరుకుంది. ఎలాంటి మందులు లేకుండా మధుమేహం తిరగబెట్టడానికి తన ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రధాన కారణమని వెల్లడించారు. రోజూ వేగంగా నడవడం, పరుగెత్తడం వల్ల మధుమేహం పూర్తిగా నయమైందని ఆయన పేర్కొన్నారు.

2015 నుంచి డయాబెటిస్‌తో బాధపడుతున్న రవిచంద్ర ఇప్పటి వరకు హాంకాంగ్, చైనా, తైవాన్, భారత్‌లో జరిగిన పలు మారథాన్‌లలో పాల్గొన్నాడు. క్రమం తప్పకుండా పనిచేయడం ప్రారంభించిన మూడు నెలల తర్వాత, అతని రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సాధారణ స్థాయి 8 నుండి 6.80కి తిరిగి వచ్చాయి. ఇప్పుడు అతను పనికి వెళ్ళే ముందు వారానికి ఆరు రోజులు 8 కిమీ నుండి 9 కిమీ వరకు పరిగెత్తాడు. పరుగు ప్రారంభించినప్పటి నుంచి సుమారు 20 వేల కిలోమీటర్లు పరిగెత్తినట్లు తెలిపారు.

తన డైట్ గురించి వివరిస్తూ.. రవిచంద్ర సాధారణంగా శాఖాహారం ఎక్కువగా తింటారు. కొన్నిసార్లు చికెన్, చేపలు తినడం ఇష్టం. వారి అల్పాహారంలో ఎక్కువ భాగం పెరుగు అన్నం, ఇడ్లీ లేదా దోస రూపంలో కార్బోహైడ్రేట్‌లను కలిగి ఉంటుంది. లంచ్, డిన్నర్ కోసం, ఉడికించిన కూరగాయలతో అన్నం తింటారు. యాపిల్స్, నారింజ కూడా తీసుకుంటానని చెప్పారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?