AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. నీళ్లు ఎక్కువ తాగినా కష్టమేనట..! పొరపాటున కూడా ఈ తప్పు చెయ్యకండి..

ఎక్కువ నీరు మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుంది. కిడ్నీలు ఎక్కువగా పనిచేసి బలహీనపడే అవకాశం ఉంది. అదనంగా, ఎక్కువ నీరు శరీరంలో సోడియం, ఎలక్ట్రోలైట్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అవి సమతుల్యతను కోల్పోతే, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే, వ్యాయామం చేసిన తర్వాత దాహం వేయడం సర్వసాధారణం. కానీ అందుకోసం నీళ్లు ఎక్కువగా తాగడం తప్పని అంటున్నారు.

వామ్మో.. నీళ్లు ఎక్కువ తాగినా కష్టమేనట..! పొరపాటున కూడా ఈ తప్పు చెయ్యకండి..
Drinking Water
Jyothi Gadda
|

Updated on: Feb 22, 2024 | 9:15 PM

Share

మంచి ఆరోగ్యానికి ఎక్కువ నీరు తాగడం తప్పనిసరి..ఇది అందరికీ తెలిసిందే..! శరీరంలో నీటిశాతం తగ్గకుండా ఉంటే రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. కానీ పరిమితి దాటితే అమృతం కూడా విషంగా మారుతుందనే నానుడి మర్చిపోకూడదు.. ఎందుకంటే.. నీళ్లు ఎక్కువగా తాగటం కూడా ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. సరైన సమయంలో, సరైన మోతాదులో నీరు తాగడం వల్ల దాని పూర్తి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఎక్కువ నీరు తాగడం వల్ల కలిగే నష్టాన్ని వాటర్ పాయిజనింగ్ అంటారు. అంటే నీరే విషంగా మారి శరీర ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. దీని వల్ల వాటర్ టాక్సిసిటీ అనే ఆరోగ్య సమస్య వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ నీరు మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుంది. కిడ్నీలు ఎక్కువగా పనిచేసి బలహీనపడే అవకాశం ఉంది. అదనంగా, ఎక్కువ నీరు శరీరంలో సోడియం, ఎలక్ట్రోలైట్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అవి సమతుల్యతను కోల్పోతే, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

నిర్ణీత వ్యవధిలో నీరు తాగాలి. కొంతమంది చాలా సేపు నీళ్లు తాగకుండా ఉండి, ఒక్కసారిగా చాలా నీళ్లు తాగుతుంటారు. ఇది మూత్రపిండాలను ప్రభావితం చేయడమే కాకుండా కాలేయం, గుండె పనితీరుపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

అలాగే, మనలో చాలా మందికి భోజనం తర్వాత నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. కానీ నిపుణులు చెప్పిన దాని ప్రకారం.. తిన్న అరగంట తర్వాత నీళ్ల తాగాలని సలహా ఇస్తారు. తిన్న తర్వాత ఎక్కువ నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందని, మూత్రంలో అవసరమైన పోషకాలు విసర్జించబడతాయని డైటీషియన్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే, వ్యాయామం చేసిన తర్వాత దాహం వేయడం సర్వసాధారణం. కానీ అందుకోసం నీళ్లు ఎక్కువగా తాగడం తప్పని అంటున్నారు. వ్యాయామం చేసే సమయంలో మనకు ఎక్కువ చెమట పట్టడం వల్ల దాహం వేస్తుంది. అందుకు ఒకేసారి ఎక్కువ నీరు తాగితే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జలుబు లేదా దగ్గు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నీటిని మితంగా తాగడం మంచిది.

మన మూత్రం రంగును బట్టి మనం తాగే నీటి పరిమాణం సరైనదా లేదా తప్పు అని చెప్పవచ్చు. మూత్రం రంగు పూర్తిగా తెల్లగా ఉంటే.. మనం అవసరానికి మించి నీళ్లు తాగుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. మూత్రం రంగు లేత పసుపు రంగులో ఉంటే, మనం తగినంత నీరు తాగుతున్నామని అర్థం చేసుకోవాలి.. మరోవైపు, మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే, శరీరంలో నీరు తక్కువగా ఉందని అర్థం. సాధారణంగా, ఆరోగ్య నిపుణులు రోజుకు 3 లీటర్ల నీళ్లు తాగాలని చెబుతున్నారు. అది కూడా క్రమమైన వ్యవధిలో నీళ్లు తాగడం చాలా ముఖ్యం.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..