AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా నివారణకు కషాయాలు తాగుతున్నారా ? వేసవిలో కషాయాలు తాగితే మంచిదేనా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితులలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కషాయాలు తాగేస్తున్నారు. కషాయాలు తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలను

కరోనా నివారణకు కషాయాలు తాగుతున్నారా ? వేసవిలో కషాయాలు తాగితే మంచిదేనా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Kadha
Rajitha Chanti
|

Updated on: Jun 04, 2021 | 9:34 PM

Share

ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితులలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కషాయాలు తాగేస్తున్నారు. కషాయాలు తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. శీతాకాలంలో దగ్గు, జలుబు వంటి వ్యాధులను నయం చేయడానికి కషాయాలను రెడీ చేస్తున్నారు. అయితే దీనిని వేసవిలో తాగడం సురక్షితమేనా ? లేదా ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలా తయారు చేస్తారు.. కషాయం అనేది ఆయుర్వేద నివారణి. ఇది వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. గిలోయ్, గుడుచి, ములేతి, లాంగ్, తులసి, దాల్చినచెక్క, అల్లం వంటి పదార్థాలను ఉడకబెట్టి దీనిని తయారు చేస్తారు. కాలానుగుణ అంటువ్యాధులు, ఫ్లూతో పోరాడటానికి ఈ పానీయం సహాయపడుతుంది. ఆర్థరైటిస్, తలనొప్పి, ఉబ్బసం, మూత్ర మార్గ సంక్రమణ, బ్రోన్కైటిస్, హెపాటిక్ రుగ్మతలతో బాధపడేవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఎలా పనిచేస్తుంది.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోగనిరోధక శక్తిని పెంచడానికి, కరోనా వైరస్ ఎదుర్కోవడానికి సహయపడుతుంది. ఇది మూలికలు, సుగంధ ద్రవ్యాలతో కషాయాన్ని తయారు చేస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్లతో లోడ్ ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి ఉన్నవారిలో కరోనా ప్రభావం తక్కువగా ఉన్నాట్లుగా నివేదికలు చెబుతున్నాయి. అయితే దీనిని ఎక్కువగా తీసుకోవడం వలన ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

వేసవిలో తాగవచ్చా … కషాయంలో ఉపయోగించే అన్ని పదార్థాలు సహజంగా దొరికేవి. కాబట్టి కషాయం ఆరోగ్యానికి మంచిదే. వేసవి కాలంలో కషాయాన్ని ఎక్కువగా తీసుకుంటే.. అది ఆమ్లత్వం, అధిక రక్తపోటు, ఆందోళన, ముక్కులో రక్తస్రావం, గుండెల్లో మంట, వికారం వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. సాధారణ కషాయ పదార్ధాల యొక్క థర్మోజెనిక్ స్వభావం అన్ని సమస్యలను కలుగజేస్తుంది.

ఎలా తీసుకోవాలంటే.. * ఉదయం లేవగానే గంట తర్వాత లేదా సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య కషాయాన్ని తాగాలి. * కషాయాన్ని ఖాళీ కడుపుతో తీసుకోకుడదు. ఇందులో ఉండే పదార్థాలు ఎసిడిటిని కలుగజేస్తాయి. * ఒకేసారి 150 మి.లీ కంటే ఎక్కువ కషాయాన్ని తీసుకోకుడదు. ఎక్కువ తీసుకోవడం వల్ల వికారం, ఆమ్ల అనుభూతి కలుగుతుంది. * కషాయంలో నల్ల మిరియాలు, అల్లం వంటి వెచ్చని పదార్థాల సంఖ్యను పరిమితం చేయండి. * ఆమ్లత్వం, గుండెల్లో మంటను తటస్తం చేయడానికి కషాయంలో తేనె కలుపుకోవాలి. * డయాబెటిస్ ఉన్నవారు కషాయంలో ఎక్కువ తేనె లేదా ములేతి వాడకుండా ఉండండి.

Also Read: Rhea Chakraborty: తొమ్మిదేళ్ళ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరోయిన్.. ఆ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో రియా..

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..