AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామిడి పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా..? కోరి సమస్యలు కొనితెచ్చుకున్నట్టే..! ఎందుకంటే..

వేసవిలో మామిడిని చాలా రకాలుగా వినియోగిస్తారు. కొంతమంది పండిన మామిడి పండ్లను తీసుకుంటే, చాలా మంది మామిడి పన్నా, మామిడి షేక్ కూడా తీసుకుంటారు. అయితే, మామిడి పండ్లను తిన్న తర్వాత నీళ్లు తాగడం, సోడాలు వంటివి తాగడం మంచిది కాదని అంటుంటారు. మామిడి పండ్లు తిని మంచి నీటిని తాగితే, కోరి సమస్యల్లో పడినట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మామిడి పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా..? కోరి సమస్యలు కొనితెచ్చుకున్నట్టే..! ఎందుకంటే..
Jyothi Gadda
|

Updated on: May 04, 2024 | 10:56 AM

Share

వేసవి కాలం మండే వేడితో పాటు మామిడికి కూడా ప్రసిద్ధి చెందింది. మామిడిని పండ్లలో రారాజు అని పిలుస్తారు. ఈ వేసవి కాలంలో ఎక్కడ చూసినా మామిడి పండ్లు విరివిగా కనిపిస్తుంటాయి. ఈ సీజన్‌లో మామిడి పండు తినని వారు ఉండరు. మామిడి పండ్లను చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. మామిడి పండ్లలో అనేక పోషకాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. వేసవిలో మామిడిని చాలా రకాలుగా వినియోగిస్తారు. కొంతమంది పండిన మామిడి పండ్లను తీసుకుంటే, చాలా మంది మామిడి పన్నా, మామిడి షేక్ కూడా తీసుకుంటారు. అయితే, మామిడి పండ్లను తిన్న తర్వాత నీళ్లు తాగడం, సోడాలు వంటివి తాగడం మంచిది కాదని అంటుంటారు. మామిడి పండ్లు తిని మంచి నీటిని తాగితే, కోరి సమస్యల్లో పడినట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మామిడి పండులో విటమిన్ ఏ విటమిన్ సి, ఐరన్ కాపర్ మెగ్నీషియం బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే మనలో చాలామంది మామిడిపండు తినే విషయంలో చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు కూడా వారికి తెలియదు. ముఖ్యంగా మామిడి పండు తిన్న తర్వాత చాలామంది మంచి నీటిని తాగుతుంటారు. కానీ, ఇది సరైన పద్ధతి కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ విధంగా మామిడిపండ్లు తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగితే గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు రావడమే కాకుండా పేగులలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. మామిడిపండు తిన్న గంట తరువాత మంచి నీటిని తాగవచ్చు.

మామిడి పండ్లతో లేదా తర్వాత పెరుగు కూడా తినకూడదని చెబుతున్నారు. ఎందుకంటే ఈ రెండూ కలిసి కడుపు సమస్యలు, జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తాయి. మామిడి పండ్లతో కలిపిన లేదా తిన్న స్పైసీ ఫుడ్ తీవ్రమైన జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అందుకే వాటిని ఎప్పుడూ కలిసి ఉండకూడదు. ఆయుర్వేదం ప్రకారం కాకరకాయ వంటి ఆహారాలను తిన్న తర్వాత కూడా మామిడికాయ, లేద పండ్లు తినటం వల్ల వికారం, వాంతులు వస్తాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌