AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dull Eyes: కంటి నుంచి నీరు వస్తూనే ఉంటుందా.. తేలికగా తీసుకోకండి.. ప్రమాదకమైన వ్యాధి కావచ్చు..

కళ్లలో ఉండే బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల డాక్రియోసిస్టిటిస్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి కారణంగా కళ్లలోని నాసోలాక్రిమ్ బ్లాక్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ అడ్డు పడటం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్‌లోని కంటి విభాగంలో డాక్టర్ ఎకె గ్రోవర్ మాట్లాడుతూ, డాక్రియోసిస్టిటిస్ విషయంలో కళ్లలోని డ్రైనేజీ ప్రాంతంలో అడ్డుపడటం క్రమంగా ఆగిపోతుందని చెప్పారు. దీంతో కళ్లలో నుంచి నీరు వస్తూనే ఉంటుంది. చాలా మందిలో ఈ సమస్య తగ్గదు, ఉదయం నిద్ర లేవగానే నీరు ఎక్కువగా ఉంటుంది.

Dull Eyes: కంటి నుంచి నీరు వస్తూనే ఉంటుందా.. తేలికగా తీసుకోకండి.. ప్రమాదకమైన వ్యాధి కావచ్చు..
Dacryocystitis
Surya Kala
|

Updated on: Dec 04, 2023 | 11:28 AM

Share

ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్లతో పాటు టీవీ, సెల్ ఫోన్ వినియోగం ఎక్కువ అవ్వడంతో చాలా మంది కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే కళ్ల నుంచి నీరు కారుతున్నా దానిని ఒక సమస్యగా పరిగణించకుండా లైట్ తీసుకుంటున్నారు. అదే సమయంలో కొంతమంది కంటి నుంచి నీరు కోరడానికి కారణం దృష్టిలో సమస్య అని అనుకుంటారు. అయితే ఆ దృష్టిలో సమస్యలను పరిశీలించిన తర్వాత కూడా, కొందరిలో ఈ సమస్య కొనసాగుతుంది. కళ్లలో నీరు వచ్చే సమస్య ఉంటే.. అది శరీరంలోని డాక్రియోసిస్టిటిస్ వ్యాధికి సంబంధించిన ఒక లక్షణం కావచ్చు. ఇది కంటి వ్యాధి. అయితే ఈ వ్యాధి గురించి చాలా మందికి సరైన అవగాహన లేదు. అటువంటి పరిస్థితిలో  ఈ వ్యాధి గురించి సమాచారాన్ని తెలుసుకోవడం ముఖ్యం. కనుక ఈ వ్యాధి గురించి నిపుణుల అభిప్రాయం గురించి తెలుసుకుందాం..

కళ్లలో ఉండే బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల డాక్రియోసిస్టిటిస్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి కారణంగా కళ్లలోని నాసోలాక్రిమ్ బ్లాక్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ అడ్డు పడటం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్‌లోని కంటి విభాగంలో డాక్టర్ ఎకె గ్రోవర్ మాట్లాడుతూ, డాక్రియోసిస్టిటిస్ విషయంలో కళ్లలోని డ్రైనేజీ ప్రాంతంలో అడ్డుపడటం క్రమంగా ఆగిపోతుందని చెప్పారు. దీంతో కళ్లలో నుంచి నీరు వస్తూనే ఉంటుంది. చాలా మందిలో ఈ సమస్య తగ్గదు, ఉదయం నిద్ర లేవగానే నీరు ఎక్కువగా ఉంటుంది.

ఏ వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడుతున్నారంటే..

ఈ వ్యాధికి సంబంధించిన బాధితుల సంఖ్య పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉంటుంది. మగవారిలో తక్కువగానూ, మహిళల్లో ఎక్కువగానూ ఉన్నాయి. మహిళలతో పోలిస్తే పురుషుల్లో 50 శాతం తక్కువ కేసులు నమోదవుతున్నాయని..  అయితే మహిళల్లో ఎక్కువ కేసులు నమోదు కావడానికి కారణం స్పష్టంగా తెలియదని చెప్పారు. డాక్రియోసిస్టిటిస్ కారణంగా కళ్ళు ఎర్రగా మారి నీరు కారుతూ ఉంటాయి. కొంత మందికి కళ్లలో వాపు ఉండవచ్చు. ఈ వాపు చాలా కాలం పాటు కొనసాగుతుంది. అటువంటి పరిస్థితిలో దీనిని నెగ్లెక్ట్ చేయవద్దు. ఈ సమస్య సుదీర్ఘంగా కొనసాగితే డాక్టర్‌ని సంప్రదించాలి. ఎందుకంటే ఈ వ్యాధికి సకాలంలో చికిత్స అందకపోతే కళ్లకు ప్రమాదం వాటిల్లుతుంది.

ఇవి కూడా చదవండి

ఫోన్ అధికంగా పెరిగితే

ఫోన్లు ఎక్కువగా వాడే వారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ గ్రోవర్ చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో.. ఫోన్ ను ఎక్కువగా ఉపయోగించకుండా దూరంగా ఉండాలి.

నివారణ చర్యలు

డాక్రియోసిస్టిటిస్ వ్యాధిని నివారించడానికి ప్రతిరోజూ కళ్లను శుభ్రమైన నీటితో కడగాలి. అదే సమయంలో పదే పదే కళ్లను చేతులతో తాకడం మానుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మంగళవారం నాడు పొరపాటున కూడా ఆ పనులు చేయకండి, క్ష్మీదేవికి ఆగ్రహం!
మంగళవారం నాడు పొరపాటున కూడా ఆ పనులు చేయకండి, క్ష్మీదేవికి ఆగ్రహం!
మీ పాత ఫోన్‌ను పైసా ఖర్చు లేకుండా సీసీటీవీగా మార్చేయండి..
మీ పాత ఫోన్‌ను పైసా ఖర్చు లేకుండా సీసీటీవీగా మార్చేయండి..
వంకాయ, ఎండు చేప, కోడి గుడ్లకూర.. ఊరించే పల్లెటూరి రుచి!
వంకాయ, ఎండు చేప, కోడి గుడ్లకూర.. ఊరించే పల్లెటూరి రుచి!
ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ
ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..
స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్
స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం