AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తినేటప్పుడు టీవీ, ఫోన్ చూస్తున్నారా? అయితే, మీ ఆరోగ్యం ప్రమాదంలో పడటం గ్యారెంటీ !

అయితే ఈ అలవాటు వల్ల కుటుంబ సభ్యులతో తమ సమస్యలను చెప్పుకునేందుకు సమయం దొరకడం లేదు. వారు ప్రత్యేక ప్రపంచంలో ఉంటారు. దీంతో ఇంట్లో కూడా విభేదాలు తలెత్తుతాయి. ఈ ప్రభావం పిల్లలపై తీవ్రంగా పడుతుంది. తినేటప్పుడు, కొన్నిసార్లు మీరు దానిపై దృష్టి పెట్టరు. మీ చుట్టూ ఏమి జరుగుతుందో మీరు పట్టించుకోరు. ఇది మానసిక ఒత్తిడికి కూడా కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకు భోజనం చేస్తూ టీవీ, ఫోన్ చూడటం మానేయండి..అదే మంచిది..

తినేటప్పుడు టీవీ, ఫోన్ చూస్తున్నారా? అయితే, మీ ఆరోగ్యం ప్రమాదంలో పడటం గ్యారెంటీ !
Watching Tv And Use Mobile
Jyothi Gadda
|

Updated on: Oct 30, 2023 | 5:29 PM

Share

చాలా మందికి భోజనం చేసేటప్పుడు టీవీ, ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. అలా టీవీ లేదంటే ఫోన్ చూస్తూ తినడం చాలా ఆసక్తికరమైన అనుభూతి అని కూడా చెప్పొచ్చు. అలా తింటేనే కొందరికి తృప్తినిస్తుంది. కానీ మన ఇంట్లో పెద్దలు మాత్రం అలా తినకూడదని చెబుతారు. అయినప్పటికీ వాళ్ల మాటలు ఎవరూ వినడం లేదు. కానీ టీవీ, ఫోన్ చూస్తూ తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పదేళ్లలోపు పిల్లలు టీవీ, ఫోన్లు చూస్తూ తినడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు..ఇలాంటి అలవాటు కారణంగా మరెన్నో సమస్యలు తలెత్తుతాయి. దాని గురించి ఇక్కడ మరింత తెలుసుకుందాం..

భోజనం చేసే సమయంలో ఫోన్, టీవీ చూసే అలవాటును తగ్గించుకోకుంటే భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెద్దలు, పిల్లలు ఇద్దరూ ఈ అలవాటును వెంటనే ఆపాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. దీనివల్ల కంటి బలహీనత, ఊబకాయం, పొట్ట సమస్యలు, గ్యాస్ సమస్యలు, ఒత్తిడి, టెన్షన్ వంటి అనేక సమస్యలు వస్తాయి. ఇలా టీవీ లేదా ఫోన్ చూడటం వల్ల ఆహారంపై దృష్టి సారించలేకపోతుంటారు. ఫలితంగా, వారు తమ ఆహారాన్ని నమలడానికి బదులుగా మింగేస్తారు. దీని వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మరి రాత్రిపూట ఇలా తింటే నిద్రకు భంగం కలుగుతుంది. అంతేకాదు.. టీవీ లేదా ఫోన్ చూస్తూ తినేవాళ్లు వాళ్లకు తెలియకుండానే అతిగా తినేస్తుంటారు. దీని వల్ల తిన్న ఆహారం జీర్ణం కాదు. ఒక్కోసారి ఊపిరి పీల్చుకోలేని పరిస్థితులు కూడా ఎదురవుతాయి. కాబట్టి భోజనం చేసేటప్పుడు టీవీ, ఫోన్ చూడటం కంటే తిన్న తర్వాత చూడటం మంచిది.

ఇంకా, ఈ అలవాటు ఇతరులతో సంబంధం లేకుండా చేస్తుంది. అయితే ఈ అలవాటు వల్ల కుటుంబ సభ్యులతో తమ సమస్యలను చెప్పుకునేందుకు సమయం దొరకడం లేదు. వారు ప్రత్యేక ప్రపంచంలో ఉంటారు. దీంతో ఇంట్లో కూడా విభేదాలు తలెత్తుతాయి. ఈ ప్రభావం పిల్లలపై తీవ్రంగా పడుతుంది. తినేటప్పుడు, కొన్నిసార్లు మీరు దానిపై దృష్టి పెట్టరు. మీ చుట్టూ ఏమి జరుగుతుందో మీరు పట్టించుకోరు. ఇది మానసిక ఒత్తిడికి కూడా కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకు భోజనం చేస్తూ టీవీ, ఫోన్ చూడటం మానేయండి..అదే మంచిది..

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..