AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: భారత్‌లో పెరుగుతున్న షుగర్ పేషెంట్స్, ఈ వ్యాధి నియంత్రణ తప్ప చికిత్స లేదు.. నిపుణుల సలహా ఏమిటంటే

భారత దేశంలో ఏటేటా మధుమేహం కేసులు పెరుగుతున్నాయని నిపుణులు తెలిపారు. ఈ నేపధ్యంలో మధుమేహంపై పరిశోధన కోసం దేశంలో బయోబ్యాంక్ కూడా సృష్టించబడింది. డయాబెటిస్ అనేది ఒక వ్యాధి. ఈ వ్యాధి నిర్మూలనకు ఇప్పటివరకు సరైన చికిత్స లేదు. కేవలం నియంత్రించే విధంగా మాత్రమే మెడిసిన్స్ ఇస్తారు. అయితే మధుమేహానికి ఎందుకు చికిత్స లేదు? ఈ విషయంపై నిపుణుల సలహా ఏమిటో తెలుసుకుందాం..

Diabetes: భారత్‌లో పెరుగుతున్న షుగర్ పేషెంట్స్, ఈ వ్యాధి నియంత్రణ తప్ప చికిత్స లేదు.. నిపుణుల సలహా ఏమిటంటే
Diabetes
Surya Kala
|

Updated on: Dec 18, 2024 | 8:15 PM

Share

భారతదేశంలో మధుమేహ బాధితుల కోసం బయోబ్యాంక్ ప్రారంభించబడింది. దీని ద్వారా ఈ వ్యాధి నివారణ, చికిత్సను మెరుగైన మార్గంలో అందించవచ్చు. భారతదేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు ఉన్నారు. ఈ కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. శరీరంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల వచ్చే ఈ వ్యాధికి ఇప్పటి వరకు చికిత్స లేదు. కేవలం నియంత్రణ మాత్రమే చేయగలరు. అమెరికా, రష్యా, ఐరోపాలోని అనేక దేశాలలో మధుమేహానికి పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకు అనేక సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి, అయితే ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి ఇప్పటి వరకు ఎటువంటి ఔషధం లేదా వ్యాక్సిన్ తయారు చేయలేదు.

మధుమేహాన్ని ఎందుకు నయం చేయలేకపోతున్నారో నిపుణులు చెప్పారు. శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ సక్రమంగా పనిచేయక, షుగర్ లెవెల్ పెరిగితే మధుమేహం వస్తుందని ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలోని మెడిసిన్ విభాగంలో డాక్టర్ అజిత్ కుమార్ వివరిస్తున్నారు. ఈ వ్యాధి దాని మూలాల నుంచి నిర్మూలించలేరు. మధుమేహానికి ఇప్పటి వరకు మందు కనుగొనబడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటి విషయం ఏమిటంటే అనేక రకాల హార్మోన్లు, ఎంజైమ్‌లు మధుమేహ వ్యాధిలో అధికంగా ఉంటాయి. ఈ సంక్లిష్టత కారణంగా షుగర్ వ్యాధికి చికిత్స చేయడం కష్టం. జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. అంటే ఇది ఒక తరం నుంచి మరొక తరానికి సోకుతుంది. అందువల్ల కూడా ఈ వ్యాధికి సరైన చికిత్స చేయలేమని చెప్పారు.

శరీరంలో చక్కెర స్థాయి పెరిగిన తర్వాత మందులతో అదుపు చేయవచ్చని, అయితే ఒకసారి మధుమేహం వస్తే.. ఈ వ్యాధికి కారణమయ్యే ప్యాంక్రియాస్ వంటి వివిధ ఎంజైమ్‌ల పనితీరును నియంత్రించడం ద్వారా చికిత్స చేయాల్సి ఉంటుందని డాక్టర్ అజిత్ వివరించారు. అప్పుడు షుగర్ కంట్రోల్ చేయడం చాలా కష్టం

ఇవి కూడా చదవండి

ఏటా పెరుగుతున్న కేసులు

ICMR ప్రకారం భారతదేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ వ్యాధి రోగుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు 30 నుంచి 40 ఏళ్లలోపు వారు కూడా మధుమేహ బాధితులుగా మారుతున్నారు. చెడు ఆహారపు అలవాట్లు, చెడిపోయిన జీవనశైలి కారణంగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అంటువ్యాధి కానప్పటికీ మధుమేహం వేగంగా వ్యాప్తి చెందుతోంది.

దేశంలోనే తొలి బయోబ్యాంక్‌ను ప్రారంభం

మధుమేహంపై పరిశోధన చేయడానికి, దీనికి సరైన చికిత్స, షుగర్ వ్యాధి నివారణ కోసం పని చేయడానికి ICMR దేశంలోని మొట్టమొదటి సారిగా బయోబ్యాంక్‌ను చెన్నైలో ప్రారంభించారు.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.  

Follow Us