AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్ ఎక్కువశాతం పురుషులకే.. ‘ఎక్స్’ క్రోమోజోములే మహిళలకు రక్ష..!

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అయితే కరోనా వైరస్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా మహిళల కంటే పురుషులు అధికంగా మరణిస్తున్నారు. దక్షిణ కొరియా లాంటి దేశాల్లో పురుషులతోపాటు మహిళల్లో కూడా కరోనా కేసులు

కరోనా ఎఫెక్ట్ ఎక్కువశాతం పురుషులకే.. 'ఎక్స్' క్రోమోజోములే మహిళలకు రక్ష..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 18, 2020 | 1:35 PM

Share

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అయితే కరోనా వైరస్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా మహిళల కంటే పురుషులు అధికంగా మరణిస్తున్నారు. దక్షిణ కొరియా లాంటి దేశాల్లో పురుషులతోపాటు మహిళల్లో కూడా కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి. కానీ మరణించిన వారిలో పురుషులే ఎక్కువమంది ఉన్నారు. ఈ వ్యత్యాసానికి జన్యుపరమైన కారణాలు ఉన్నాయంటున్నారు కెనడాకు చెందిన ఫిజీషియన్‌, అరుదుగా వచ్చే వ్యాధులపై అధ్యయనం చేసిన డాక్టర్‌ షరోన్‌ మోలెమ్‌. ముఖ్యంగా మహిళల్లో ఉండే ఎక్స్‌, ఎక్స్‌ క్రోమోజోమ్‌లు కొవిద్ ను సమర్థంగా ఎదుర్కోవడానికి వారికి ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.

కాగా.. పురుషుల్లో ఎక్స్‌, వై క్రోమోజోమ్‌లు ఉంటా యి. కానీ మహిళల్లో ఎక్స్‌, ఎక్స్‌ క్రోమోజోమ్‌లు ఉంటాయి. మెదడుకు సంబంధించిన ముఖ్యమైన జన్యువులు ఎక్స్‌ క్రోమోజోమ్‌లోనే ఉంటాయి. అదీగాక మనిషి జీవించడానికి కూడా వై క్రోమోజోమ్‌ కంటే ఎక్స్‌ క్రోమోజోమే అత్యంత కీలకం. పురుషుల్లో కండబలం, శారీరక బలం ఉంటుంది. కానీ దీర్ఘకాలం జీవించడానికి వీటికంటే ఎక్స్‌ క్రోమోజోమ్‌లే ఎక్కువగా దోహదం చేస్తాయి. మహిళలకు ఇది పుట్టుకతో సహజంగా వచ్చే ప్రయోజనం. ఈస్ట్రోజన్‌ వల్ల కూడా మహిళల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.

మరోవైపు.. పురుషుల్లో టెస్టోస్టిరాన్‌ రోగనిరోధకతను తగ్గిస్తుందని డాక్టర్‌ షరోన్‌ చెప్పారు. అందువల్ల జన్యుపరంగానే పురుషుల్లో ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధులపై పోరాడే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. క్యాన్సర్‌ విషయంలో కూడా పురుషులకంటే మహిళలే మెరుగ్గా తట్టుకోగలుగుతున్నారు. డబుల్‌ ఎక్స్‌ క్రోమోజోమ్‌ పవరే దీనికి కూడా కారణం అని డాక్టర్‌ షరోన్‌ అభిప్రాయం. తన పరిశోధనల ఆధారంగా ‘ది బెటర్‌ హాఫ్‌: ఆన్‌ ద జెనెటిక్‌ సుపీరియారిటీ ఆఫ్‌ విమెన్‌’ అనే పుస్తకాన్ని షరోన్‌ రాశారు.