దీపావళి బంపర్ ఆఫర్.. 101 రూపాయలకే స్మార్ట్ ఫోన్..!
స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా.? ఏదైనా ఆఫర్లో తక్కువకు తీసుకుందామని చూస్తున్నారా.? అయితే లేట్ చేయొద్దు! వెంటనే కొనుగోలు చేయండి.
స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా.? ఏదైనా ఆఫర్లో తక్కువకు తీసుకుందామని చూస్తున్నారా.? అయితే లేట్ చేయొద్దు! వెంటనే కొనుగోలు చేయండి. ఎందుకంటే దీపావళి పండుగకు వివో అదిరిపోయే ఆఫర్ను ప్రకటించింది. పండగ సందర్భంగా వై50, వీ20ఎస్ఈ, వీ20, ఎక్స్ 50 సిరీస్ స్మార్ట్ఫోన్లను 101 రూపాయలకే సొంతం చేసుకోవచ్చునని ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్యాంక్ అఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుల ద్వారా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ ఉంటుందని పేర్కొంది. ఈ వివరాలను తెలుపుతూ వివో తాజాగా ఓ ట్వీట్ చేసింది.
Also Read: పాకిస్థాన్లో హిందువులపై మూక దాడి.. రక్షించిన ముస్లింలు..
”గొప్ప దీపావళి ఆఫర్లతో కొత్త ఆనందాన్ని వెలిగించండి. కేవలం ₹ 101 చెల్లించి మీకు అత్యంత ఇష్టమైన వివో ఫోన్లలో సొంతం చేసుకోండి. అదనపు ప్రయోజనాలను కూడా ఆస్వాదించండి” అంటూ వివో ట్వీట్లో పేర్కొంది. ఈ ఆఫర్ ప్రకారం మొదట రూ. 101 డౌన్ పేమెంట్ చెల్లించి.. ఆ తర్వాత సులభ ఈఎంఐల రూపంలో ఫోన్ మొత్తం డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: ఏపీ: 829 మంది టీచర్లకు.. 575 మంది విద్యార్ధులకు కరోనా.!
Light up a new delight with great Diwali offers. Get your hands on the most loved vivo phones by paying just ₹101 and enjoy additional benefits. Click on the link to find the nearest vivo store: https://t.co/GYFTgNDbnQ pic.twitter.com/zzTwxLPhqv
— Vivo India (@Vivo_India) November 6, 2020