AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాఠశాలలు తెరిచేందుకు కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలు

పాఠశాలలను తెరిచేందుకు కేంద్ర విద్యాశాఖ  మార్గదర్శకాలను విడుదల చేసింది. అక్టోబరు 15 తర్వాత స్కూళ్లు, విద్యాసంస్థలను తెరవచ్చని స్పష్టం చేసింది.

పాఠశాలలు తెరిచేందుకు కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలు
Ram Naramaneni
|

Updated on: Oct 05, 2020 | 11:16 PM

Share

పాఠశాలలను తెరిచేందుకు కేంద్ర విద్యాశాఖ  మార్గదర్శకాలను విడుదల చేసింది. అక్టోబరు 15 తర్వాత స్కూళ్లు, విద్యాసంస్థలను తెరవచ్చని స్పష్టం చేసింది. దశల వారీగా స్కూళ్లు తెరవాలని సూచించింది. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని.. స్థానిక అవసరాల మేరకు ఎస్​ఓపీ(స్టాండర్డ్​ ఆపరేటింగ్​ ప్రొసీజర్​)ను రూపొందించే అధికారాలను రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు  అధికారాలిచ్చింది.

అయితే విద్యార్థుల హాజరుపై కొంత వెసులుబాటు కల్పించాలని విద్యాశాఖ పేర్కొంది. స్కూళ్లు తెరుచుకున్న 2-3 వారాల వరకు ఎలాంటి అసెస్​మెంట్లు ఉండకూడదని వివరించింది. ఇప్పటివరకు ఆన్​లైన్​లో క్లాసులకు హాజరవుతోన్న విద్యార్థులు.. ఇప్పుడు పాఠశాలలకు చేరుకునే ప్రక్రియ వీలనైంత సులభంగా ఉండాలని విద్యాశాఖ వెల్లడించింది. ( తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్, తగ్గిన ఆర్‌- వాల్యూ )