AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2020 Match 19: RCB vs DC : తేలిపోయిన ఆర్సీబీ, ఢిల్లీ ఏకపక్ష విజయం

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా సోమవారం దుబాయ్ వేదికగా  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 59 పరుగుల తేడాతో బంపర్ విక్టరీ నమోదు చేసింది.

IPL 2020 Match 19: RCB vs DC : తేలిపోయిన ఆర్సీబీ, ఢిల్లీ ఏకపక్ష విజయం
Ram Naramaneni
|

Updated on: Oct 05, 2020 | 11:34 PM

Share

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా సోమవారం దుబాయ్ వేదికగా  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 59 పరుగుల తేడాతో బంపర్ విక్టరీ నమోదు చేసింది. ఢిల్లీ నిర్ధేశించిన‌ 197 పరుగుల టార్గెట్‌ను చేధించడంలో ఆర్సీబీ తేలిపోయింది. అన్ని విభాగాల్లో రాణించిన ఢిల్లీ ఐపీఎల్‌లో మరో క్రేజీ‌ విజయాన్ని సొంతం చేసకుంది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన  బెంగళూర్ బాట్స్‌మెన్స్ తీవ్రంగా విఫలమయ్యారు. ఓపెనర్లు దేవదూత్‌ పడిక్కల్‌(4) అరోన్‌ ఫించ్(13) జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత ఒక‌రి త‌రువాత ఒక‌రు వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి వెంటనే పెవిలియన్ బాట పట్టారు. కెప్టెన్ కోహ్లీ ఒక్కడే 43 ( 39 బంతుల్లో2 ఫోర్లు, 1 సిక్స‌ర్‌) ప‌రుగులు చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఏ ద‌శ‌లోనూ ఆర్సీబీ పట్టుచూపించలేదు. దీంతో ఢిల్లీ విజయం ఏకపక్షమైంది. ఢిల్లీ బౌలర్ రబడ నాలుగు వికెట్లు తీసి ఆర్సీబీని కొలుకోలేని దెబ్బతీశాడు.  అలాగే నోర్జె, అక్షర్ ప‌టేల్‌ల‌కు చెరో 2 వికెట్లు ద‌క్కాయి. అశ్విన్ 1 వికెట్ తీశాడు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ  ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి ఆ జ‌ట్టు 196 ప‌రుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ల‌లో మార్క‌స్ స్టాయినిస్ 53 (26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు)  ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే పృథ్వీ షా 42  (23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌లు) ప‌రుగులు చేశాడు. రిష‌బ్ పంత్ 37 ( 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ప‌రుగులు, శిఖ‌ర్ ధావ‌న్ 32 ( 28 బంతుల్లో 3 ఫోర్లు) సమిష్ఠిగా రాణించారు . దీంతో ఢిల్లీ భారీ స్కోరు చేయ‌గలిగింది. ఇక బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ 2 వికెట్లు తీయ‌గా, మొయిన్ అలీ, ఉదానాలు చెరొక వికెట్ దక్కించుకున్నారు. ( పాఠశాలలు తెరిచేందుకు కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలు )