Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..రేపట్నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి సర్వదర్శనానికి మళ్లీ టోకెన్ల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..రేపట్నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 25, 2020 | 4:38 PM

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి సర్వదర్శనానికి మళ్లీ టోకెన్ల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 2 నెలలు విరామం తర్వాత సర్వదర్శనం టోకెన్ల జారీ చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. రోజుకు 3 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ తెెలిపింది. వెంకటేశ్వరస్వామి దర్శనానికి ఒక రోజు ముందు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి ఈ టోకెన్లు జారీ చేస్తారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికే అలిపిరి నుంచి కొండపైకి పర్మిషన్ ఇవ్వనున్నారు.

Also Read : యాంజియోప్లాస్టీ సక్సెస్.. కపిల్ డిశ్చార్జ్‌