దేవరాజ్‌ బ్లాక్‌మెయిల్ చేయడం వలనే మా అక్క చనిపోయింది

అక్క ఆత్మహత్య చేసుకోబోతుందన్న విషయం దేవరాజ్‌కి తెలిసినా తమ ఇంట్లో ఎవరికీ చెప్పలేదని శ్రావణి సోదరుడు శివ అన్నారు.

దేవరాజ్‌ బ్లాక్‌మెయిల్ చేయడం వలనే మా అక్క చనిపోయింది
Follow us

| Edited By:

Updated on: Sep 12, 2020 | 9:49 AM

Actress Sravani case: అక్క ఆత్మహత్య చేసుకోబోతుందన్న విషయం దేవరాజ్‌కి తెలిసినా తమ ఇంట్లో ఎవరికీ చెప్పలేదని శ్రావణి సోదరుడు శివ అన్నారు. తమ అందరి నంబర్లు దేవరాజు దగ్గర ఉన్నాయని.. ఆ సమయంలో ఎవరికైనా ఫోన్ చేసి ఉంటే తమ అక్కని బతికించుకునేవాళ్లమని శివ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంట్లో దేవరాజ్ కొన్ని రోజులు ఉన్నాడని, ఆ తరువాత ఎవరైనా చూస్తే బాగోదని రావొద్దని తన అక్క దేవరాజ్‌కి చెప్పిందని, అయినా వినిపించుకోకుండా ఇంటికి వచ్చేవాడని ఆరోపించారు. హాస్టల్ ఫుడ్ పడట్లేదు అని తన అక్కను నమ్మించి తమ ఇంట్లో దేవరాజ్ ఉండేవాడని, అతడి ప్రవర్తన తన సోదరికి అస్సలు నచ్చలేదని శివ చెప్పుకొచ్చారు.

దేవరాజ్ పరిచయం ఉన్నట్లు మొదట్లో తన సోదరి తనకు చెప్పలేదని, ఫోన్‌లో ఫొటో చూసి అడిగితే టిక్‌టాక్‌లో పరిచయం అయినట్లు చెప్పిందని అతడు వెల్లడించారు. తమ ఇంట్లో ఉన్నప్పుడే అక్క ఫోన్‌లో ఉన్న ఫోటోలు, వీడియోలు దేవరాజు ఫోన్‌లోకి ఎక్కించుకునేవాడని శివ తెలిపారు. దేవరాజ్ వేరే అమ్మాయిలతో తిరుగుతాడని తనతో అక్క చెప్పిందని అతడు చెప్పుకొచ్చేవారు. తాను, తన ఫ్యామిలీ హైదరాబాద్ వెళ్లిన కొత్తలో మంచి, చెడ్డ సాయి చూసుకునేవాడని.. అక్క డిప్రెషన్‌లో ఉన్నప్పుడు అశోక్ రెడ్డి తమ ఇంటికి వచ్చి తమకు ధైర్యం చెప్పాడని పేర్కొన్నారు.

దేవరాజ్‌పై కేసు పెట్టిన తర్వాత అక్క చాలా బయటపడిందని శివ చెప్పుకొచ్చారు. దేవరాజ్ దగ్గర వీడియోస్ ఉన్నాయని అక్క, సాయికి చెప్పిందని.. అందుకే దేవరాజ్ అంటే సాయికి కోపమని అతడు తెలిపారు. బ్లాక్ మెయిల్ చేయడం, బయటకు రాకపోతే పరిణామాలు వేరేలా ఉంటాయని అక్కని బెదిరింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని శివ చెబుతున్నారు. దేవరాజు రెడ్డిని హోటల్‌లో సాయిని కొడుతున్నప్పుడు అడ్డు వెళ్లినప్పుడు అక్కకు దెబ్బ తగిలిందని.. కేవలం దేవరాజ్ వలనే అక్క ఆత్మహత్య చేసుకుందని శివ వెల్లడించారు.

Read More:

బయటపడుతున్న నూతన్ నాయుడు మోసాలు.. పెరుగుతున్న ఫిర్యాదులు

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,278 కొత్త కేసులు.. 10 మరణాలు

Latest Articles