AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: ఆ జిల్లాలో మార్చి 7వ తేదీ వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్.. ప్రకటించిన మంత్రి..

Corona Virus Effect: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య..

Corona Virus: ఆ జిల్లాలో మార్చి 7వ తేదీ వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్.. ప్రకటించిన మంత్రి..
Shiva Prajapati
|

Updated on: Feb 22, 2021 | 3:01 PM

Share

Corona Virus Effect: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. నాగ్‌పూర్ జిల్లా పరిధిలో కరోనా కేసులు అధికంగా పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లను తాత్కాలికంగా మూసినట్లే వేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి నితిన్ రౌత్ ప్రకటించారు. మార్చి 7వ తేదీ వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందన్న ఆయన.. తదుపరి పరిణామాలను అనుసరించి నిర్ణయం ఉంటుందని చెప్పారు. అలాగే ప్రధాన మార్కెట్లు వారాంతాల్లో మూసివేయాలని నిర్ణయించారు. ఇక హోటళ్లు, రెస్టారెంట్లు 50శాతం సామర్థ్యంతో నడిపేందుకు అనుమతిస్తామన్నారు. ఫంక్షన్ హాళ్లను ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 7 వ తేదీ వరకు పూర్తిగా మూసివేయబడుతాయని మంత్రి స్పష్టం చేశారు. మార్చి 7 తరువాత పరస్థితులను బట్టి వాటిని తెరవాలా? లేదా? అనేదానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇకపోతే మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 6,971 కొత్త కరోనా కేసులు నమోదు అవ్వగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 21,00,884 చేరింది.

ANI Tweet:

Also read:

‘అక్షర’ ప్రీరిలీజ్‌ వేడుకకు గెస్ట్‌‌‌‌‌గా కల్వకుంట్ల కవిత.. టీమ్ పై ప్రశంసలు కురిపించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు

‘ఏసీ కార్ల నుంచి బయటకు రండి, ప్రజల బాధలు చూడండి’, సైకిల్ తొక్కుతూ మోదీకి వాధ్రా ‘పిలుపు’