AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రంజాన్ నేపథ్యంలో.. దుబాయ్ రాజు.. సంచలన నిర్ణయం..

కోవిద్-19 మహమ్మారి వికృతరూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. రంజాన్ మాసం సందర్భంగా దుబాయి రాజు, యూఏఈ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సంచలన నిర్ణయం

రంజాన్ నేపథ్యంలో.. దుబాయ్ రాజు.. సంచలన నిర్ణయం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 23, 2020 | 3:49 PM

Share

కోవిద్-19 మహమ్మారి వికృతరూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. రంజాన్ మాసం సందర్భంగా దుబాయి రాజు, యూఏఈ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూఏఈ జైళ్లలో మగ్గుతున్న 874 ఖైదీలను విడిచిపెట్టాలని బుధవారం ఆదేశాలను జారీ చేశారు. ఈ ఆదేశాలతో ఖైదీల కుటుంబాలలో ఆనందాన్ని నింపినట్టు అయిందని అటార్నీ జనరల్ ఆఫ్ దుబాయి ఇస్సా అల్ హుమైదన్ అన్నారు.

కాగా.. ఖైదీలు కొత్త జీవితాన్ని మొదలుపెట్టి, ప్రజలతో కలిసి జీవించేందుకు ఇదో అవకాశమన్నారు. అయితే.. దుబాయి రాజు ఇటీవల యూఏఈలోని వివిధ జైళ్లలో ఉన్న 1,511 ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు మరోమారు ఖైదీలకు కొత్త జీవితాన్ని ప్రసాదించడం ద్వారా ఖైదీల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా, అజ్మన్ రాజు కూడా 124 మంది ఖైదీలను విడిచిపెట్టనున్నట్టు వెల్లడించారు. యూఏఈ ప్రభుత్వం ప్రతి ఏడాది ఖైదీలను విడిచిపెడుతూ రావడం ఆనవాయితీగా వస్తోంది.