కరోనాకు వెరవని ధీరులు.. బ్యాంకు ఉద్యోగులకు రూ.20లక్షల బీమా..!
కరోనా వీరవిహారం చేస్తున్నప్పటికి వెరవకుండా డ్యూటీ చేస్తోన్న తమ ఉద్యోగులకు ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ బీమా కవరేజీని అందిస్తున్నట్లు ఆర్థిక శాఖ ట్విట్టర్లో పేర్కొంది. ఎంప్లాయిస్ సంరక్షణకు బ్యాంకులు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది. సిబ్బంది కోసం స్పెషల్ గా డాక్టర్లను నియమించడమే కాకుండా.. ఒక హెల్ప్లైన్ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దురదృష్టవశాత్తు ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఎంప్లాయిస్ కోవిడ్-19 సోకి మరణిస్తే భారీ స్థాయిలో బీమా పరిహారాన్ని అందజేయనున్నట్లు ఒక ట్వీట్లో ఆర్థిక […]
కరోనా వీరవిహారం చేస్తున్నప్పటికి వెరవకుండా డ్యూటీ చేస్తోన్న తమ ఉద్యోగులకు ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ బీమా కవరేజీని అందిస్తున్నట్లు ఆర్థిక శాఖ ట్విట్టర్లో పేర్కొంది. ఎంప్లాయిస్ సంరక్షణకు బ్యాంకులు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది. సిబ్బంది కోసం స్పెషల్ గా డాక్టర్లను నియమించడమే కాకుండా.. ఒక హెల్ప్లైన్ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
దురదృష్టవశాత్తు ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఎంప్లాయిస్ కోవిడ్-19 సోకి మరణిస్తే భారీ స్థాయిలో బీమా పరిహారాన్ని అందజేయనున్నట్లు ఒక ట్వీట్లో ఆర్థిక శాఖ వెల్లడించింది. ఏ బ్యాంకుకాబ్యాంకు తమ ఎంప్లాయిస్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ బీమా కవరేజీని నిర్ణయించినట్లు సమాచారం. కాగా ఇది రూ.20 లక్షల వరకు ఉండొచ్చని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.